Sunday 25 March 2018

అంబేద్కర్ చెప్పిన మాట

మనుధర్మం -10


ఎం.వి.ఆర్. శాస్త్రి 

......

   మానవులందరూ సమానం.

   ఇది ఆదర్శం.

   ఎవరు ఎన్నికబుర్లు చెప్పినా మనుషులందరూ సమానం కాదు.

   ఇది వాస్తవం.

   సర్వమానవ సమానత్వాన్ని సాధించి , సమసమాజాన్ని స్థాపించి సోషలిస్టు స్వర్గాన్ని భూమిమీదికి కి తెస్తానని చెప్పి కొన్నితరాలతరబడి జనాన్ని మాయచేసిన కమ్యూనిస్టు పార్టీలలోనే సమానత్వం లేదు. ఆ సిద్ధాంతం ప్రపంచం లో బతికున్న కాలంలో సోషలిస్టు రాజ్యాలలోనే పార్టీ నాయకులకు ...  పార్టీలో , ప్రభుత్వం లో పలుకుబడి కలిగిన వారికి ఉండే ప్రత్యేక సౌకర్యాలకు , వైభోగాలకు - మామూలు పార్టీ మెంబర్లు , సాధారణ ప్రజలు ఎన్నడూ నోచుకోలేదు.

   కులాల అంతరాలను నిర్మూలించి , బడుగు బలహీన దళిత కులాలవారిని పైకి తెచ్చి సిసలైన సామాజిక న్యాయాన్ని సాధించటానికి అవతారమెత్టినట్టు చెప్పుకునే పార్టీలలో కూడా పెత్తనం చేసే పాలక వర్గానికి , నాయకుల బంధుమిత్ర ఆశ్రితగణానికి ఉండే ప్రాముఖ్యం , ప్రాధాన్యం బడుగుబలహీన దళిత కులాలకే చెందిన సాధారణ పార్టీ సభ్యులకు  ఉండదు.

  ప్రాచీన కాలంలో ఋషులు నెలకొల్పిన , వేల సంవత్సరాలు ఈ దేశం లో దివ్యంగా అమలుజరిగిన వర్ణ వ్యవస్థను ఈ కాలపు నానా భ్రష్టత్వాల దృష్టితో దుర్భాషలాడే వారు గుర్తించవలసిన కఠోర యథార్థమిది.

   వెనకపడిన కులాలకు, బడుగు బలహీన దళిత వర్గాలకు చెందిన సహోదరులందరినీ ఎక్కడా ఎందులో ఎటువంటి వివక్షచూపకుండా అందరితో సమానంగా ఆదరించాలని బస్తాలకొద్దీ పుస్తకాలు ,కట్టలకొద్దీ కవిత్వాలు రాసే పుణ్యాత్ములు కూడా తమ ఇళ్ళలో పనిచేసే పనిమనుషులను .. వారు కూడా తమలాగే దళిత కులానికో, తమలాగే బి.సి. కులానికో చెందినవారేనని తెలిసినా సరే -- వారిని పనిమనుషుల్లాగే చూస్తారు. తమతో పాటు సోఫాలలో కూచోబెట్టుకొని , రాగానే కాఫీ ఇచ్చి , దేశంలో బడుబలహీన దళిత కులాలకు జరుగుతున్న అన్యాయాల గురించి ముచ్చటించరు. ఎందుకంటే కులం ఒకటే అయినా పనిమనుషుల తరగతి వేరు .

    ఒక ఉన్నతాధికారికి, ఒక పెద్ద వ్యాపార ప్రముఖుడికి , ఒక పోలీసు ఆఫీసరుకు ఇచ్చే గౌరవాన్ని , చూపే ఆదరాన్ని ... కాయకష్టం చేసుకుని బతికే నౌకర్లూ చాకర్లమీద సాధారణంగా ఎవరూ చూపించరు. లేబర్ పని చేసే వాడు నీచుడనికాదు. ఉన్నతస్థానాలలో ఉన్నవారు ఉత్తములనీ కాదు. వారు చేసే పని హెచ్చుతగ్గులను బట్టి సమాజంలో వారికి ఉండే స్థానం హెచ్చుతగ్గులు ఆధారపడతాయి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా , ఏ సమాజంలో నైనా ఉన్నదే.

   గుర్రం , గాడిద మనిషి దృష్టిలో ఎప్పటికీ సమానం కాదు.  సమాజానికి ఉత్తమ సేవ చేస్తూ, అతి ముఖ్యమైన కీలక బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తులకు ఉండే విలువ కూలీ పని చేసుకుని , కాయకష్టంతో బతికే మామూలు పనివాడికి ఉండదు. అది న్యాయమా అన్యాయమా అన్న చర్చ ఇక్కడ అనవసరం. చేసే వృత్తిని బట్టి మనిషి విలువ ఉంటుందన్నదే ఇక్కడ గమనించవలసిందల్లా !

   మరి మనువు చెప్పిందీ అదే కదా ? చేసే వృత్తిని బట్టి అతడు సమాజాన్ని నాలుగు తరగతులుగా వర్గీకరించాడు. చేసే పని ప్రాముఖ్యాన్ని బట్టి ఆయా తరగతుల ఎక్కువ తక్కువలను నిర్ణయించాడు. అందులో తప్పేమిటి ?

   ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా బలవంతుడు బలహీనులమీద పెత్తనం చేయటమే కనపడుతుంది. బలవంతుడు చెప్పినట్టే మిగతావారంతా నడవాల్సిందే. అధికారం చెలాయించేవాడు ఏమి చేసినా , ఏమి చెప్పినా మిగతావారు నోరుమూసుకుని చచ్చినట్టు పడి ఉండవలసిందే. ఎంతటి విద్వాంసుడైనా , ఎంత గొప్ప జ్ఞాని అయినా పరిపాలకుడి ఆధిపత్యానికి , అతడి దయా దాక్షిణ్యాలకు లోబడి బతకవలసిందే ! కదా ?

    ప్రపంచ మానవ చరిత్ర మొత్తంలో మొట్టమొదట  ఒక్క మనువు మాత్రమే జ్ఞానానికి , విద్వత్తు కు పెద్దపీట వేశాడు. విద్య నేర్పే , ధర్మం బోధించే , సదాచారం ఆచరించే శ్రేష్ఠుడు , రాజ్యమేలే వాడికంటే అధికుడు అన్న అత్యుత్తమ ప్రమాణాన్ని మనువు నెలకొల్పాడు. విద్య అధ్యయనం , అధ్యాపనం , సమాజ హితం కోసం యజ్ఞాలు చేయటం , చేయించటం విధిగా నిర్దేశించబడ్డ బ్రాహ్మణ తరగతికి సమాజంలో అత్యున్నత గౌరవ స్థానం ఇచ్చాడు. ప్రజలకు రక్షణ , భద్రత కల్పించి శాంతిని కాపాడే క్షత్రియ తరగతికి రెండో స్థానం కేటాయించాడు. వ్యవసాయం, పశుపాలన, వర్తక వాణిజ్యాలను నిర్వహించే వైశ్య వర్ణానికి మూడో ప్రాధాన్యం ఇచ్చాడు. ఏ నైపుణ్యం లేక , విద్య, సంస్కారాలకు దూరమై అధమస్థాయిలో జీవించే వారిని  శూద్ర నిర్ణయించి , పై వర్ణాలకు సేవచేసే పనిని అప్పగించాడు.

  అంతే కాదు. ఏ వర్ణానికి ఆ వర్ణానికి విధులను, బాధ్యతలను, ఉండవలసిన యోగ్యతలను మనువు  స్పష్టం గా నిర్వచించాడు. ఎవరు ఏ వర్ణానికి చెందుతారనేది పుట్టుకను బట్టి నిర్ణయం కాదనీ , వారివారి చాయిస్ ను బట్టే ఉంటుందనీ కట్టడి చేశాడు. బ్రాహ్మణ తలిదండ్రులకు పుట్టినవాడైనాసరే , బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి శూద్రలక్షణాలను  సంతరించుకుంటే శూద్రుడుగానే పరిగణింపబడతాడన్నాడు. అలాగే శూద్ర కుటుంబం లో పుట్టినవాడు బ్రాహ్మణ లక్షణాలను , యోగ్యతను సంతరించుకుంటే బ్రాహ్మణుడుగానే గుర్తించబడాలని చెప్పాడు. ఇలా స్వభావాన్ని బట్టి , గుణాన్ని బట్టి. సామర్ధ్యాన్ని బట్టి ఒక వర్ణంనుంచి ఇంకో వర్ణానికి ప్రమోషనుకూ , ఆటోమేటిక్ డిమోషనుకూ మనువు గట్టి కట్టు బాటు పెట్టాడు. ఇందులో తప్పు పట్టవలసింది ఏముంది ?

  కాలక్రమంలో మనువు నిర్ణయించిన " గుణాన్ని బట్టి వర్ణాలు " కాస్తా " పుట్టుకను బట్టి కులాలు " గా వికృత రూపం సంతరించుకున్నాయి.  పోనుపోను ఆ కులవ్యవస్థ వికటించి వెర్రితలలు వేసింది . ఆ వికారపు అవకరాన్ని  చేతనైతే శాయశక్తులా రూపుమాపవలసిందే. కాని అనంతర కాలంలో జరిగిన వైపరీత్యానికి మనువు నెందుకు తిట్టిపోయటం ? అంబేద్కర్ ప్రభ్రుతులు రూపొందించిన భారత రాజ్యాంగవ్యవస్థలో  పోనుపోను చోటు చెసుకున్న విపరీతాలకు, వికృతాలకు అంబేద్కర్ బాధ్యుడని మతివున్నవాడెవడైనా అంటాడా ? మరి మనువు పెట్టిన ధర్మవ్యవస్థలో తరవాత జరిగిన వైపరీత్యాలకు మనువును ఎందుకు ముద్దాయిని చేయటం ?

  మనువు పేర్కొన్న బ్రాహ్మణ, క్షత్రియ , వైశ్య , శూద్ర తరగతులే కాలక్రమంలో అవే పేర్లతో కులాలుగా మారటంతో మనం చూస్తున్న కులాలు, మనువు పెట్టిన వర్ణాలు ఒకటేనన్న దురభిప్రాయం మనకు కలిగింది. అది మన అవగాహన లోపం. నిజానికి కులాలకూ వర్ణాలకూ ఎక్కడా అసలు పోలికే లేదు. ఆ మాట వేరెవరో కాదు. మనువాదానికి , కులవ్యవస్థకు  బద్ధవ్యతిరేకి అయిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కరే అంగీకరించాడు . Annihilation of Caste , Castes in India అనే గ్రంథాలలో ఆయన ఏమన్నాడో చూడండి :



  The principle underlying caste is fundamentally different from the principle underlying varna.Not only are they fundamentally different , but they are also fundamentally opposed .
[ Annihilation of Caste , B.R.Ambedkar , P.59 ]

( కులం వెనుక ఉన్న సూత్రం వేరు. వర్ణం వెనుక ఉన్న సూత్రం వేరు. ఆ రెండూ మౌలికంగా వేరు కావటం ఒకటే కాదు. అవి మౌలికంగా పరస్పర వ్యతిరేకమైనవి కూడా ) 

   We shall be well advised to recall at the outset that the Hindu society, in common with other societies, was composed of classes and the earliest known are the (1) Brahmins or the priestly class ; (2) the Kshatriya, or the military class ; (3) the Vaishya, or the merchant class and (4) the Shudra,or the artisan and menial class. Particular attention has to be paid to the fact that this was essentially a class system, in which individuals, when qualified, could change their class, and therefore classes did change their personnel.
[CASTES IN INDIA , Dr. B.R.Ambedkar , P.17 -18 ]
   
    ( అప్పటిలో మిగతా సమాజాల లాగే హిందూ సమాజం నాలుగు తరగతులుగా విభజింపబడినదని మనం గుర్తుంచుకోవాలి. ప్రాచీనకాలంనుంచీ తెలిసినవి ఏమిటంటే 1. బ్రాహ్మణులు అనే పురోహిత తరగతి. 2. క్షత్రియులు అనే  సైనిక తరగతి  3. వైశ్య అనే వర్తక తరగతి 4. శూద్ర అనే చేతిపని , పరిచారక తరగతి . ముఖ్యంగా గమనించవలసిన వాస్తవం ఏమిటంటే ఇది ప్రధానంగా తరగతి వ్యవస్థ . కావలసిన అర్హత సంపాదించినప్పుడు వ్యక్తులు తమ తరగతినీ మార్చుకొనగలరు.  తరగతులు వ్యక్తులను మార్చుకొనగలవు. )

   Varna and Caste are two very different concepts. Varna is based on the principle of each according to his worth, while Caste is based on the principle of each according to his birth. The two are as distinct as chalk is from cheese.
[Annihilation of Caste , B.R.Ambedkar , P.93 ]
  
   ( వర్ణం ,కులం అనేవి వేరువేరు భావనలు . వర్ణం యోగ్యతను బట్టి , కులం పుట్టుకను బట్టి నిర్ణయమవుతాయి. రెండిటికీ మధ్య జున్నుకూ , సుద్దకూ ఉన్నంత తేడా ఉంది. ) 

   వర్ణవ్యవస్థ గురించి మనవారికి ఉన్న రెండో పెద్ద దురభిప్రాయం ఏమిటంటే అందులో శూద్రులకు బొత్తిగా విలువ లేదని. వారిని నీచులుగా చూసి దారుణమైన వివక్షకు , అవమానాలకు గురి చేశారని. అసలు శూద్రులనబడే వారు ఈ దేశం లో ఆదినుంచి ఉన్న భూమిపుత్రులనీ , ఎక్కడినుంచో వచ్చిన ఆర్యులు వారిని లొంగదీసుకుని , "దస్యులు లేక దాసులు" అని వారికి పేరు పెట్టి , తమ వర్ణ వ్యవస్థలో అవమానకరమైన నాలుగో స్థానం ఇచ్చి కాళ్ళకింద తొక్కివేశారని  పిచ్చి పుస్తకాలు రాసిన వాళ్ళూ ఉన్నారు. ఆర్యులు తెల్లని వారనీ , ద్రవిడులు లేక శూద్రులు నల్లని వారని రంగుల తంపులు పెట్టిన మేధావులూ ఉన్నారు. వీరి  దుష్ప్రచారాలకు దిమ్మతిరిగే సమాధానం అంబేద్కర్ గారే ఇవ్వాలి .

   It is erroneous to believe that the Shudras were conquered by the Aryan invaders. In the first place the story that the Aryans came from outside India and invaded the natives has no evidence to support it. There is a large body of evidence that India is the home of the Aryans. In the second place there is no evidence anywhere of any warfare having taken place between Aryans and Dasyus but the Dasyus have nothing to do with the Shudras. 
[Dr. Babasaheb Ambedkar Writings and Speeches , Vol.3 , P. 420 ]

( దండెత్తివచ్చిన ఆర్యులు శూద్రులను జయించారనుకోవటం తప్పు. అసలు- ఆర్యులు భారతదేశం బయటినుంచి వచ్చి ఇక్కడి దేశీయులను ఆక్రమించారన్న కథకు పిసరంత సాక్ష్యం లేదు. భారతదేశమే ఆర్యుల స్వస్థలం అనటానికి బోలెడు సాక్ష్యాలున్నాయి. ఆర్యులకు , దస్యులకు మధ్య యుద్ధం జరిగిందనడానికి సాక్ష్యం లేదు. దస్యులకు, శూద్రులకు సంబంధమే లేదు. )

  The Shudras were Aryans i.e. they were believers in the Aryan way of life. The Shudra was accepted as an Aryan and as late as Kautilya’s Artha Shastra was addressed as Arya. The Shudra was an integral, natural and valued member of the Aryan Society ... ( ibid  P.421  )

   ( శూద్రులు ఆర్యులు .వారు ఆర్య జీవనవిధానాన్ని విశ్వసించేవారు. శూద్రుడు అర్యుడిగా అంగీకరించబడ్డాడు. కౌటిల్యుడి అర్థశాస్త్రం నాటి కి కూడా "ఆర్యా" అనే శూద్రుడు సంబోధించబడ్డాడు. ఆర్య సమాజంలో శూద్రుడు సమగ్రమైన, సహజమైన , విలువగల సభ్యుడు )

    That the Shudras were invited to be present at the coronation of the King along with Brahmins, Kshatriyas and Vaishyas is proved by the description given in the Mahabharata of the coronation of Yudhisthira the eldest brother of the Pandavas. Shudra took part in the consecration of the King. According to ancient writer called Nilkantha speaking of the coronation ceremony expressly says: “that the four chief Ministers, Brahmin, Kshatriya, Vaishya and Shudra consecrated the new king. Then the leaders of each Varna and by the Castes lower still consecrated him with the holy water. (ibid , P. 421 )

   ( రాజు పట్టాభిషేక సమయంలో  బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్యులతో పాటు శూద్రులు కూడా అక్కడ ఉండేవారు.. పాండవుల అగ్రజుడు  యుధిష్తిరుడి పట్టాభిషేకం గురించి మహాభారతం లో ఉన్న వర్ణన దీనికి రుజువు. బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య, శూద్ర వర్ణాలకు చెందినా అమాత్యులు, తరవాత ప్రతివర్ణానికి , దిగువ కులాలకు చెందిన ప్రముఖులు కొత్తరాజును పవిత్ర జలం తో అభిషేకించారని నీలకంటుడనే ప్రాచీన గ్రంథకర్త స్పష్టంగా చెప్పాడు.)  

ఇంకా ఉంది .





 



























    

No comments:

Post a Comment