Thursday 29 March 2018

ఇప్పటికివి చాలు

వాజపేయి హయాంలో జ్యోతిషాన్ని కాలేజీ కోర్సు ను చేసే ప్రతిపాదనపై దేశమంతటా వీర సైన్సువాదులు గగ్గోలు పెట్టినప్పుడు ఆ ప్రతిపాదనను సమర్థిస్తూ పదిహేడేళ్ళ కింద ఆంధ్ర భూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నేను వరసగా రాసిన వ్యాసాలలో కొన్నిటిని ఇవాళటి వరకూ ఇక్కడ పోస్ట్ చేసాను. 2001 సంవత్సరంలో ఈ విషయం మీద నాలుగు రోజులుదృష్టి సారిస్తే నేను తెలుసుకున్నజోస్య సంబంధ వాస్తవాలను ఆనాటి వ్యాసాల్లో ఉటంకించాను . టీవీల చచ్చు పుచ్చు ఏకపక్ష రచ్చల్లో సైన్సు తత్త్వం వంటబట్టని సైన్సు వకాల్తా దారులు , హేతుదృష్టి ఏ కోశానా లేని కుహనా హేతువాదులు అరిగిపోయిన రికార్డులా వినిపించే మూర్ఖపు వాదనల బోలుతనాన్ని అర్థం చేసుకోవటానికి నేను వెనుక రాసినవే చాలు.

ఇప్పుడు మళ్ళీ గట్టిగా దృష్టి పెడితే ఇటీవలి కాలంలో 100 శాతం ఫలించిన ఎన్నో రికార్డయిన జోస్యాలను బయటికి తీయవచ్చు. ఈ విషయం లో ఆసక్తి ఉన్న వాళ్ళు కాస్త ఓపికతో గూగుల్ సెర్చ్ చేస్తే కావలసినంత సమాచారం తెలుస్తుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవసరమనుకుంటే ఈ విషయంలో నేనే కొత్తగా చేయి చేసుకుంటాను.

జ్యోతిషాన్ని మూఢనమ్మకమని పబ్లిక్ గా కొట్టిపారేసే వాళ్ళలో నూటికి 80 మంది నిజజీవితంలో జ్యోతిషానికి పైకి చెప్పుకోని వీరవిధేయులు. వారిలో నూటికి 80 మంది మూఢనమ్మకాల పుట్టలు. జ్యోతిషాన్ని , సంప్రదాయాన్ని, పూజా పునస్కారాలను పిచ్చి పిచ్చిగా అస్తమానం తూలనాడే పేరు గొప్ప తెలుగు టీవీ చానెల్ ను నడిపే పెద్దమనిషి కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటున్న లోకోత్తర దృశ్యాన్ని ఈ మధ్యే సోషల్ మీడియా బయటపెట్టింది. జ్యోతిషం మీద ఒంటి కాలి మీద లేచే దమ్మున్న ఇంకో మీడియా మోతుబరీ తన వరకూ వచ్చేసరికి జ్యోతిష్కుడిని కన్సల్ట్ చేయకుండా ఏ పెద్ద పనికీ ఉపక్రమించడు. ఇలాంటి హిపోక్రైట్ల చేతులోని మీడియాకూ , అది వాగించే మిడిమిడి జ్ఞానుల వాగుళ్ళకూ విలువేమిటి ? కల్లాకపటపు హేతువాద పిల్లుల నిర్హేతుక శాపాలకు జ్యోతిష శాస్త్రం ఉట్లు తెగుతాయా ?

No comments:

Post a Comment