Friday 13 September 2019

ఇకనైనా మీరు మారరా!!


డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్

(ఊపిరితిత్తుల వైద్య నిపుణులు

WHO - Corona IPC Observer.)

.............

      2019డిసెంబర్ 31 న్యూఇయర్ వేడుకల్లో మునిగితేలే ప్రజానీకానికి తెలియని విఘాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ డోర్ తట్టింది.

     ఒకటో తారీకు పొద్దున తలుపు తెరిచి చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివ్వెర  పోయె నిజాలను
తెలుసుకునే లోపే, కంటి ముందర పిడుగు పడితే ఎలా ఉంటుందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ లో నున్న వైద్యులకి,  పరిశోధకులకు, పాలక మండలికి వెన్నులో వణుకు వచ్చింది.

      చైనా ఏది చెప్పినా కూడా రెండుసార్లు ఆలోచించాలని ప్రపంచంలో అందరికీ తెలుసు!! కానీ ఈ సారి మాత్రం చైనా చెప్పిన మాటల్లో  కొంత సత్యం కనబడ్డది.

      చిన్నపాటి జ్వరం, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, వంటి సాధారణమైన ఫ్లూ లక్షణాలు గా ఉన్న  వైరస్ గమనిస్తూ ఉండగానే, మానవాళిని కుదిపేసే, ప్రపంచ జీవనానికి సవాల్ విసిరే ఓ మహమ్మారిగా coronavirus ప్రత్యక్షమైంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

      కొరోనావైరస్ ఎలా వచ్చింది?ఎలా ఉంటుంది? ఎలా నియంత్రణ చేయాలి? అని తెలుసుకునే లోపు, వేల సంఖ్యలో చైనాలో ప్రజలు దీపపు పురుగులు చచ్చినంత సులువుగా చనిపోయారు.

       అక్కడి నుంచి మొదలైన ఈ  కొరోనా వైరస్ మహమ్మారి , చైనాని తన గుప్పిట్లోకి తీసుకొని, సర్వ నాశనం చేసి,  మిగతా ప్రపంచ దేశాలపై కన్నేసింది.

         ఏ ఏ దేశాల్లో అయితే ప్రజలు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ,అత్యంత నిర్లక్ష్య ధోరణి వహించారో వారిపై     కొరోనావైరస్ పంజా విసిరింది.
            మాకేమీ కాదు, మేము చాలా గట్టి వాళ్లం, మా చుట్టూ మనుషులు, డబ్బు,ధనము, అంతస్తు,  అధికారము, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, మాకు  కొరోనావైరస్ సోకే అవకాశమే  లేదు, అనుకుని అహంకరించిిన అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పదుల నుంచి మొదలుకొని, వందలు వేల లెక్కచొప్పున రాలిపోతున్నారు.

        ఇక మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం!
        వ్యాధి వచ్చిన తర్వాత కూడా, వ్యాధితో నేనున్నానని  తెలియకుండా  మాయ లో ఉంచే వ్యాధి coronavirus. ఇది ముక్కు, నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి ఊపిరితిత్తుల లోపలికి వెళ్లి, ఊపిరితిత్తుల నాశనం మొదలు  అయ్యేంత వరకూ ...ఇది చాలా సర్వసాధారణమైన లక్షణాలు అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిగా మనము భావించి, వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకొని,ఖర్మగాలి Corona Virus నిర్ధారణ అయితే..... అప్పటికే మీ శరీరంలో పుష్కలంగా, లక్షల లో కోరనా వైరస్  క్రీములు, వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది.
      అశ్రద్ధ చేసినట్లయితే, Corona వైరస్ సోకిన మనిషి తెలుసుకొని, చికిత్స విధానము కొరకు  వైద్య వ్యవస్థ ని ఆశ్రయించే టప్పటికి, ఈ వైరస్ ఊపిరితిత్తులు నాశనము చేసి, కుళ్లిపోయే నిమోనియా మార్పులు తెచ్చి, శ్వాస ప్రక్రియలో తీవ్ర అంతరాయం  కలిగిస్తుంది, ఆరడుగుల మనిషిని   అరరోజు లో,  ఆరు అడుగుల ఐ సి యు  మంచంపై  జీవచ్ఛవంలా పడేస్తుంది .

        ఊపిరితిత్తుల్లో సాధారణంగా క్షయ వ్యాధి వచ్చినప్పుడు, అశ్రద్ధ  చేసిన రోగులకు ఆరు నెలలకి , ఫైబ్రోసిస్ (fibrosis- Permanent damaged scaring)అనే శాశ్వతమైన మార్పులు ఏవైతే  వస్తాయో... వాటన్నిటినీ Corona virus  15 నుంచి నెల రోజుల  లోపలే తీసుకొని వస్తుందంటే, ఈ వైరసు   ఎంత  ప్రమాదకర మైనదో, దాని విషము మానవ శరీరాన్ని  ఎంత నాశనం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

         ఇంతటి భయంకరమైన Corona Virus పట్ల ఏ మాత్రం అశ్రద్ధ వహించినా  కోలుకోలేని దెబ్బ శరీరముపై పడడం ఖాయం.

       తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1)  రోడ్లపై తిరగకుండా, పనులు సాధ్యమైనంత తగ్గించుకుని ఇంటి పట్టున   ఉండడం అత్యుత్తమం.

2) జ్వరము, దగ్గు,తుమ్ములు,ఒళ్ళు నొప్పులు ఆయాసం,ఈ లక్షణాలు వచ్చి రెండు మూడు రోజుల్లో గనక తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

3) కనీసం నాలుగు గంటలకు ఒకసారి చేతులు ముఖ్యంగా వేలు అరిచెయ్యి శుభ్రంగా సబ్బుతో  కడగడం అవసరం.

4) బయట తిరిగేటప్పుడు సాధ్యమైనంతవరకు  మనిషి - మనిషి  మధ్య మూడు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడగలిగితే ఈ వ్యాధి వ్యాప్తిని చాలావరకు అరికట్ట వచ్చు. (Social Distancing.)

5) పార్కులు, క్లబ్బులు , థియేటర్లు , ఫంక్షన్ హాల్స్ వంటి పబ్లిక్ స్థలాలు, ఆటోలు, బస్సులు,  ట్రైను, ఏరోప్లేన్, వంటి ప్రయాణ మాధ్యమాలు సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయాలి.

6) కుదిరితే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలో, కొత్త వారు ఎవరు వచ్చినా క్షుణ్ణంగా  వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని, వారు  కూడా పరిశుభ్రత నియమావళి పాటించాలి. వారికి గనక పై వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే నిర్మొహమాటంగా  పరీక్షలు నిర్వహించాలి.

7) పోషకాహారం తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. చైనాలో మాంసాహార  మార్కెట్లోనే ఈ వ్యాధి పురుడుపోసుకుంది అని గుర్తుంచుకుని మాంసాహారులు  జాగ్రత్త పడాలి.


       అంతా ప్రభుత్వమే చేస్తుంది గా!!

       అంతా ప్రభుత్వమే చేస్తుందనుకుని, మన బాధ్యత కూడా ప్రభుత్వంపై నెట్టేయడం, కరోనా వ్యాధి కంటే భయంకరమైన ఆలోచన వ్యాధి.  ఎవడి ఇల్లు వాడే జాగ్రత్త పరచుకోవాలి! ఎవరి వొళ్లు వారే కాపాడుకోవాలి!

        తెలిసీ తెలియని వాళ్లు సోషల్ మీడియాలో చేసే పిచ్చి వాగుళ్లకు మోసపోకుండా ,  వైద్యం గురించి ఏమీ తెలియని మహానుభావులు చెప్పే చచ్చుపుచ్చు చిట్కాల మాయలో పడకుండా భిన్నమైన,   Corona virus గురించి వాస్తవాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండక పోతే కొంప కొల్లేరు అవ్వడం ఖాయం!!




మహావీరుడి సాహసగాథ


(ఈ సెప్టెంబర్ నెలాఖరులో వెలువడనున్న నా "సుభాస్ చంద్ర బోస్" పుస్తకంలో ముందుమాట)

   ఇది ఒక సాహసవీరుడి కథ. ఒక దేశభక్తుడి అద్భుత గాథ. భారత స్వాతంత్ర్య సమర ప్రధాన సేనాపతి  సుభాస్ చంద్ర బోస్ ఉజ్వల జీవిత చరిత్ర.


    1757 లో ప్లాసీ నుంచి 1944లో ఇంఫాల్ దాకా ఇంచుమించు రెండు శతాబ్దాలపాటు బ్రిటిషు దురాక్రమణదారులపై భారత వీరులు చేసిన పోరాటాలకు లెక్కలేదు. చూపిన శౌర్యానికి,పరాక్రమానికి సాటిలేదు. దేశం కోసం కష్టాలుపడి, త్యాగాలు చేసి , ఉరికంబాలెక్కి , ప్రాణాలు ధారవోసిన కీర్తికాయులకు కొదవలేదు. వీరిలో ఎవరికీ తీసిపోనివాడు, స్వాతంత్ర్య సేనానులలో ముందు లెక్కించవలసిన వాడు, తరతరాల దేశభక్తుల ఆత్మార్పణకు లక్ష్యమైన స్వరాజ్యం (లాంటిది)  జాతికి సిద్ధించటానికి కారణభూతుడైనవాడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్.
     రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల ఆటంబాంబు విజయం తరవాత ఇండియాలో బ్రిటిషు సామ్రాజ్యానికి ఎదురులేదు. 1942లో క్విట్ ఇండియా అలజడిని క్రూరంగా అణచివేసిన మీదట దేశంలో జాతీయ ఉద్యమం సద్దుమణగింది. ఇక ఆ తరవాత కాంగ్రెస్ నాయకుల పని అయిపోయింది. వారికి వయసు మళ్లింది. అలసిపోయారు.మళ్లీ జైలుకు వెళ్లటానికి ఏ ఒక్క రు సిద్ధంగా లేరు. ఇది అనంతర కాలంలో నెహ్రూ పండితుడే బ్రిటిష్ జర్నలిస్టు,గ్రంథకర్త Leonard Mosley  ముందు సిగ్గు పడకుండా ఒప్పుకున్న నిజం. [The Last Days of The British Raj, Leonard Mosley,  p.285]
       
    మళ్లీ జైలు అంటేనే భయపడేంతలా  చేవచచ్చి చచ్చుబడిన జాతీయ కాంగ్రెస్ మహాసంస్థను చూసి బ్రిటిష్ రాజ్ హడలిపోయే ప్రసక్తే లేదు. అయినా కొంపలేవో మునుగుతున్నట్టు, భూతమేదో తరుముకొస్తున్నట్టు ఇంగ్లీషు వాళ్ళు జండా పీక్కుని ఇండియా నుంచి ఉడాయించాలని ఎందుకు తొందర పడ్డారు?
   
దీనికి సమాధానం చెప్పగలిగింది అప్పుడు ఆ నిర్ణయం చేసిన బ్రిటిష్ ప్రభువులే. ఇదే ప్రశ్న నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీని 1956 కోలకతా పర్యటనలో పశ్చిమ బెంగాల్ యాక్టింగ్ గవర్నర్ ఫణిభూషణ్ చక్రవర్తి అడిగాడు. సుభాస్ చంద్రబోస్ ఐ.ఎన్.ఎ. కార్యకలాపాలు  బ్రిటిష్ పవరుకు మూలాధారమైన సైనిక, నౌకా దళాల  విధేయత పునాదిని  బలహీనపరచటమే దానికి ముఖ్య కారణమని అట్లీ జవాబు. మీ నిష్క్రమణ మీద గాంధీ ప్రభావం ఎంత అని చక్రవర్తి అడిగితే అట్లీ ‘చాల తక్కువ’ అని తిరస్కారసూచకంగా వత్తి పలికాడు. [History of The Freedom Movement in India, R.C.Majumdar, vol.3,p.610]
    ఇదీ వాస్తవం! మమ్మల్ని వెళ్ళగొట్టింది సుభాస్ చంద్ర బోసే; గాంధీ కాదు- అని ఆదరా బాదరా ఉడాయించిన ఇంగ్లిషు వాళ్ళే చెప్పాక  మనకు స్వాతంత్ర్యం ఎవరివల్ల వచ్చింది అన్న విషయంలో సందేహానికి తావులేదు. బానిసత్వపు సంకెళ్ళు తెగగొట్టినందుకు కృతజ్ఞతతో భారతజాతి మొదట స్మరించవలసింది నేతాజీ  సుభాస్ చంద్ర బోసును.
    విచిత్రం, విషాదం ఏమిటంటే వీరుల త్యాగ ఫలాన్ని తేరగా అనుభవించిన  మన ఖల్ నాయక్ లు, వారికి గొడుగుపట్టే మేధావులు  అసలు కథానాయకుడైన నేతాజీ ఊసే ఎత్తరు ; స్వాతంత్ర్యం తెచ్చిన పుణ్యంలో అతడికి కూడా వాటా ఉందనీ ఒప్పుకోరు! ఎన్నో వేల సంవత్సరాల రికార్డెడ్ చరిత్ర కలిగిన ప్రాచీన భారత జాతికి 150 ఏళ్ల కింద పుట్టినవాడు ‘జాతిపిత’ అనీ... సత్యం, అహింసల నిష్ఠతో గాంధీ మహాత్ముడి నాయకత్వాన కాంగ్రెస్ మహాసంస్థ చేసిన సత్యాగ్రహాల వల్లనే దేశానికి విదేశీ చెర వదిలిందని తెల్లవారి రాజకీయ వారసులైన దేశవాళీ దొరలు  చరిత్రకు వెల్లవేయించి  భావి తరాలవారికి బ్రెయిన్ వాష్ చేశారు. గాంధీ, నెహ్రూలు మినహా వేరొకరిని తలవాల్సిన అవసరమే లేనట్టు కల్లబొల్లి చరిత్రలను వండి వార్చారు.
    చరిత్రకు ఎన్ని చేతబడులు  చేసినా ఈ దేశ వాసుల గుండె గుడిలో నేతాజీకున్న సుస్థిర , శాశ్వత స్థానాన్ని ఎవరూ  తొలగించలేక పోయారు. ఇప్పటికీ దేశంలో ఏ మూల ఏ ఊరికి వెళ్ళినా నేతాజీ విగ్రహం కనిపిస్తుంది. నేతాజీకి సంబంధించిన ఏ సమాచారమైనా జనానికి ఆసక్తి కలిగిస్తుంది. నేతాజీ పేర యువజన సంఘాలు ఎల్లెడలా పనిచేస్తున్నాయి. నేతాజీ బొమ్మ చూస్తేనే యువతరానికి  నేటికీ ఒళ్ళు పులకరిస్తున్నది.
     సుభాస్ చంద్ర బోస్ వలె విదేశాలకు వెళ్లి తమ దేశ విమోచన కోసం పోరాడిన యోధులు ప్రపంచచరిత్రలో ఎందరో ఉన్నారు. కాలం కలిసివచ్చి, పరిస్థితులు అనుకూలించి ఉంటే లెనిన్, మాజినీ, డి వలెరాలలాగా నేతాజీ కూడా దిగ్విజయం సాధించి ఘన నీరాజనాలు అందుకునే వాడే. చెప్పుడు మాటలు వినకుండా సోవియట్ రష్యా బోసు తపనను, చిత్తశుద్ధిని ఏ దశలో ఏ కాస్తయినా అర్థం చేసుకుని ఉంటే తనకు ఇష్టం లేకున్నా నాజీల పంచన చేరవలసిన అగత్యం అతడికి వచ్చేదే కాదు.అక్ష రాజ్యాల(Axis Powers) కూటమిలోని జర్మనీ, జపాన్ పాపిష్టి పాలకులు  ఏ మాత్రమైనా ప్రాప్తకాలజ్ఞతచూపి  నేతాజీ హితవును సకాలంలో మన్నించి ఉంటే భారత చరిత్రగతి మరో విధంగా ఉండేది. అలసి సొలసి ,ముదిమి మీద పడి , ఇక పోరాటం చేసే సత్తువపోయి కాళ్ళు బారజాపిన కాంగ్రెస్ నేతాశ్రీలు చేవ, శక్తి ఉన్న సుభాస్ చంద్ర బోస్ పోరాటానికి ఏ మాత్రం సహకరించినా నిజమైన స్వరాజ్యం మనకు 1947కు ముందే సిద్దించేది. ఎంత ప్రయత్నించీ ఏదీ కలిసిరాకపోయినా , ఎల్లెడలా ప్రతికూలతే ఎదురైనా ధైర్యం కోల్పోక, సంకల్పం సడలక , ఓడిపోతానని తెలిసీ వీరోచితంగా పోరాడి, ఆఖరి నెత్తురుబొట్టును కూడా దేశం కోసం అర్పించాడు కనకే అతడు నేతాజీ అయ్యాడు. ఒక ధర్మవీరుడు, అకళంక దేశభక్తుడు, కర్మయోగి ఎలా ఉంటాడు, రాజకీయాలను ఎలా నడుపుతాడు, ఎలా పోరాడతాడు అన్నదానికి సజీవ దృష్టాంతంగా జాతిజనుల గుండెల్లో నిలిచిపోయాడు.
      ఆరాధనాభావం కొల్లలుగా ఉన్నా నేతాజీకి సంబంధించిన చాలా వివరాలు నేటి తరానికి తెలియవు.తెలిసే అవకాశమూ లేదు. గాంధీ, నెహ్రుల మీద టన్నులకొద్దీ ఉన్న సాహిత్యంతో.... వారి మీద విపరీతంగా జరిగిన అధ్యయనాలూ, పరిశోధనలతో ... వారి స్మృతులను ,అడుగుజాడలను భద్రపరిచేందుకు అమలైన బృహత్ ప్రణాళికలతో పోల్చితే నేతాజీ విషయంలో జరిగింది స్వల్పాతిస్వల్పం. హీనాతిహీనం. సర్కారీ ప్రాపకం లేని  ఏ మహానుభావుడి చర్యలనైనా, చరిత్రనైనా సొంత కుటుంబం వారే పదిలపరచుకోవలసి రావటం ఈ దేశ దౌర్భాగ్యం. బోస్ చరిత్ర బాధ్యత కూడా ప్రధానంగా ఆయన కుటుంబానికి మాత్రమే పట్టింది. ‘నేతాజీ రిసెర్చ్ బ్యూరో’ స్థాపించి వారే ఏవో తంటాలు పడుతున్నారు. వారి కృషి గొప్పదే. కానీ దానికీ సహజంగానే చాలా పరిమితులుంటాయి.
      నేతాజీ బోస్ మీద అనేక భాషల్లో గ్రంథాలు చాలానే వచ్చాయి. కాని వాటిలో సమగ్రం, ప్రామాణికం అనదగ్గవాటిని వేళ్ళమీద  లెక్కించటానికి రెండో చేయి అక్కర్లేదు. బ్రిటిషు సి.ఐ.డి. వాసన పట్టకుండా ఉండటానికి బోస్ తన కార్యకలాపాలను ఎక్కడా గుర్తులను మిగల్చకుండా గుంభనంగా నడపవలసివచ్చింది. ఏదో సందర్భంలో అతడితో సంపర్కం ఉన్న వారు తమ పాత్రను అతిగా చిత్రిస్తూ చిలవలు పలవలు అల్లి  అనంతరకాలంలో పుస్తకాలు రాసెయ్యటంతో రకరకాల కల్పనలు వ్యాప్తిలోకి వచ్చాయి.
       నేతాజీ పేరు చెప్పగానే ఎవరికైనా మనసులో మెదిలేది మిలిటరీ యూనిఫాం వేసుకున్న పోరాటమూర్తి. ముందు గుర్తొచ్చేది ఆయన అద్భుతంగా నడిపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లేక ఆజాద్ హింద్ ఫౌజ్. నేతాజీ అనగానే ఈ కాలంలో ప్రతివారూ ఆసక్తితో అడిగేవి ఇవి: ‘విమాన ప్రమాదంలో నిజంగా మరణించాడా? మరణించక పొతే ఏమయ్యాడు? ఆయనే ‘గుమ్నామీ బాబా’ అట నిజమేనా?’ నేతాజీ కి సంబంధించి ఇవి ముఖ్య ప్రశ్నలనటంలో సందేహం లేదు. కాని బోస్ గురించి తెలుసుకోవలసింది అతడి మాయం మిస్టరీ ఒకటే కాదు. దానికంటే ముఖ్యమైనది, ప్రతి నవయువకుడూ గమనించవలసింది, గుర్తుపెట్టుకోవలసింది దేశంలో ఉండగా సుభాస్ చంద్ర బోస్ రాజకీయ చరిత్రను! మహాత్ముడని నిఖిలలోకం కొనియాడిన, యావద్భారతం నెత్తిన పెట్టుకున్న గాంధీజీని సైతం నిర్భయంగా ఎదిరించగలగటం... గాంధీ నిలబెట్టి సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థిని  సైతం బహిరంగ ఎన్నికలో ఓడించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కాగలగటం...తనకు ఏ అధికార హోదా లేకపోయినా కలిసిన ప్రతి దేశాధినేతనుంచీ విశేష గౌరవం అందుకోగలగటం  ఎంతో గుండె బలం , ప్రజా బలం, గొప్ప వ్యక్తిత్వం  ఉన్న మహానాయకుడికి తప్ప సాధ్యపడదు. అంతటి నేతను ఉపేక్షించి దమ్మూ ధైర్యం లేని నెహ్రూలాంటి వారిని మాత్రమే జాతీయనేతలుగా కీర్తించటం చరిత్రకు అపచారం. మన విజ్ఞతకు అవమానం.
     మన స్వాతంత్ర్య పోరాటంలో సుభాస్ చంద్ర బోస్ ఉజ్వల పాత్రను వాస్తవంగా చిత్రించే ప్రయత్నమే ఈ పుస్తకం. ఇది కేవలం బోస్ జీవితచరిత్రే కాదు. అతడిని కేంద్రంగా తీసుకుని 1920-1945 మధ్య జాతీయోద్యమ చరిత్రనూ ఇందులో స్పృశించాను. ఆ విదంగా 1922 చౌరీ చౌరా దగ్గర ఆగిన ‘ మన మహాత్ముడు’కు ఇది కొనసాగింపు. నా చరిత్ర గ్రంథాల సీరీస్ లో ‘భగత్ సింగ్’ కు ఇది తరువాయి.
     జాతి జీవితంలో ఆధునిక కాలాన నడయాడిన మహాపురుషులు చాలామందే ఉన్నారు. సుభాస్ చంద్ర బోస్ జీవితంలో ఉన్నంత వైవిధ్యం, కార్యకలాపాల విస్తృతి , సాహస ప్రవృత్తి, శౌర్యం, ధైర్యం, త్యాగం, నిష్కల్మష మనస్తత్వం , ఆలోచనల రేంజి, కలర్ ఫుల్ పర్సనాలిటీ చాలా కొద్ది మందిలో  కనపడుతుంది. అనేక ఖండాల లోని , అనేక దేశాలలో అనేక దశాబ్దాలు సాగిన  బహుముఖ కార్యకలాపాలను, సాహస కృత్యాలను ఒక్క పుస్తకంలో చరిత్రకు న్యాయం చేస్తూ ఇమడ్చటం కష్టం. దేశంలో బోస్ రాజకీయ చరిత్రను, జర్మనీ కేంద్రంగా అతడి యాక్టివిటీలను ఈ పుస్తకంలోచర్చించాను. , రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పక్షం వహించి బోస్ పెద్ద తప్పు చేసాడు ; హిట్లర్ అడ్డాలో ఉండి నాజీల ఏజెంటు అన్న శాశ్వత అపకీర్తి మూట కట్టుకున్నాడు - అని తెలిసీ తెలియనివారు దురుద్దేశపూరితంగా 70, 80 ఏళ్లుగా వేస్తున్న అభాండాలకు సమాధానాలూ ఇందులో ఇచ్చాను.
     తూర్పు ఆసియాలో నేతాజీ సైనిక చర్యలను, భారత స్వాతంత్ర్యంపై వాటి నిర్ణయాత్మక ప్రభావాన్ని, నేతాజీ కథ ముగింపు మిస్టరీని దీని తరువాయి పుస్తకం "నేతాజీ'లో రాద్దామనుకుంటున్నాను.
                      













    

   

Saturday 31 August 2019

రాజకీయ వివేకానంద


    మనిషికీ గొడ్డుకూ తేడా ఏమిటి? గొడ్డు దేవుడిని తలవదు.  కొలవదు. అవి  రెండూ మనిషికి చేతనవును."
    " మంచి గుణం, దైవభక్తి ఉన్నవాడు తక్కువ కులం వాడైనా సరే  నేను  నెత్తిన పెట్టుకొని పూజిస్తాను."
    పరీక్షలు దగ్గర పడ్డాయి అంటే కంగారు  పడతాం. కానీ జీవితంలో ప్రతి క్షణమూ దైవంధర్మం మనకు పరీక్ష పెడుతూనే ఉంటాయి.
    అసలు ఎందుకమ్మా ఈ చదువులుపెద్ద చదువు చదివి ఏ జడ్జీయోపెద్ద  ఆఫీసరో   అయి, చూసేవాళ్లకు  కళ్ళుకుట్టేంతలా సంపాదించాలా? డబ్బు,అధికారం లేకపోయినా, పేదరికంలో ఉండి కూడా మంచి మనుషులమని  అనిపించుకోవడం  మేలుకాదా?"
     స్కూల్లో చదువుకుంటుండగా 15 ఏళ్ల  వయస్సులో  సుభాస్ చంద్రబోస్ తన తల్లికి రాసిన ఉత్తరాల్లోని కొన్ని వాక్యాలివి!  ఆయన అసంపూర్ణ ఆత్మకథ An Indian Pilgrim కి అనుబంధంగా చేర్చిన చిన్ననాటి ఉత్తరాల్లో వీటిని చదవొచ్చు.
    వేదాంత గ్రంథాల సారం పిండిన మహా పండితులని అనుకోబడే వారిలోనే చాలామందికి లేని ఈ వివేకం సుభాస్ కి  చిన్న వయసులోనే ఎలా అబ్బింది?
     దీనికి ప్రేరణ స్వామి వివేకానంద!

    ఎవరో చుట్టాలబ్బాయిని కలవటానికి సుభాస్ అతడున్నచోటికి అనుకోకుండా వెళ్లాడు.అక్కడ వివేకానందుడి గ్రంథాలు కనపడ్డాయి.యథాలాపంగా ఒక పుస్తకం తీసుకుని కొన్ని పేజీలు తిరగెయ్యగానే సుభాస్ కి ఒళ్లు ఝల్లుమంది.
    "చదివి ఇచ్చేస్తానని చెప్పి ఆ పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని ఆత్రంగా చదివాను. నా మేను పులకరించింది. నాకు కావలసిన ఆదర్శం వివేకానందుడి దగ్గర దొరికింది. వారాల తరబడి ఆ పుస్తకాలను మళ్లీ మళ్లీ చదివాను. 'కొలంబో నుంచి అల్మోరా వరకు’  వివేకానందుడి ప్రసంగాలు,ఆయన రాసిన ఉత్తరాలు నన్ను బాగా ఇన్ స్పైర్ చేశాయి. 'ఆత్మనో మోక్షార్ధం జగత్ హితాయచ (వ్యక్తి తన ముక్తి కోసమేకాక ప్రపంచహితం కోసమూ పాటుపడాలి) అన్నదే జీవితలక్ష్యం అని నా మనసులో గట్టిగా నాటుకుంది. మానవసేవలో దేశ సేవ అంతర్భాగమని అర్థమైంది. పండితుడి నుంచి కడజాతివాడి వరకూ అందరూ నా సోదరులనీ...అగ్రవర్ణాల ఆధిపత్యానికి కాలం చెల్లిందనీ..శూద్రులూ,అట్టడుగు దళిత జనులూ పైకి వచ్చి అధికారం చలాయించే కాలం వచ్చిందనీ గట్టి నమ్మకం కలిగింది. వివేకానంద నా జీవితంలో ప్రవేశించే నాటికి నాకు నిండా 15 ఏళ్లు లేవు. నాటినుంచి నా అంతరంగంలో విప్లవం మొదలైంది. వివేకానంద మార్గమే నామార్గమైంది.
    -అంటాడు సుభాస్ తాను పూర్తిచేయని ఆత్మకథ An Indian Pligrim 37,38 పేజీలలో. పైన ఉటంకించిన ఉత్తరాలను అమ్మకు రాసింది ఈ పెను మార్పు తరవాతే.
    చాలామంది నాయకులు వివేకానంద తమకు ఆదర్శం అని గొప్పగా చెప్పుకున్నారు. వివేకానంద వాక్కులను అవసరమైనప్పుడల్లా వాడేసుకుని,అదంతా తమ ధర్మాగ్రహమేనని నమ్మించాలని ఎంతో మంది ఆరాటపడతారు. కాని సుభాస్ బోస్ వలె స్వామి వివేకానంద అంతరంగాన్ని అవగతం చేసుకుని,ఆయన తత్వంలో తాదాత్మ్యం చెంది,తనదైన పంథాలో దాన్ని ముందుకు తీసుకుపోయిన రాజకీయ నాయకుడు వేరొకరు కనిపించరు. వివేకానందుడు సుభాస్ ని ఎంతలా ప్రభావితం చేశాడంటే కొన్ని కీలక ఘట్టాల్లో సుభాస్ బోస్ చేసిన ఉద్వేగభరిత,ప్రవాహసదృశ ప్రసంగాలను ఆలకిస్తే వివేకానందుడే మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. సుభాస్ స్థానంలో వివేకానందుడు ఉంటే అచ్చు అలాగే చేసేవాడు-ఆయా సవాళ్లకు అలాగే స్పందించే వాడు-బోలుతనాలను అలాగే ఎండగట్టేవాడు అన్న అభిప్రాయం కలుగుతుంది.
    ఇంకోవిధంగా చెప్పాలంటే సుభాస్ చంద్ర  రాజకీయ వివేకానంద! స్వామి వివేకానంద ఆధ్యాత్మిక సుభాస్ చంద్ర!! జీవించిన కాలం,కార్యక్షేత్రం వేరువేరయినా ఇరువురిలోనూ ఉన్నది దేశంగురించి,ధర్మం గురించి ఒకే రకమైన  తపన! ఆధ్యాత్మిక విషయాల గురించి సుభాస్ బోస్ ఎప్పుడో అరుదుగా తప్ప మాట్లాడకపోతేనేమి? క్రియాశీల రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నప్పుడు,కొండలను డీకొని సాహస పోరాటాలు చేస్తున్నప్పుడు,దేశ విమోచన కోసం అపూర్వ అద్భుత సైనిక సంగ్రామం సాగిస్తున్నప్పుడు కూడా అతడిలో భారమంతా దైవం మీద వేసి,ఫలితం మీద యావలేకుండా నిశ్చలంగా,నిర్వికారంగా తన ధర్మం తాను నిర్వర్తిస్తున్న నిష్కామ కర్మయోగి కనపడతాడు.
[ఈ నెలాఖరులో వెలువడనున్న నా కొత్తపుస్తకం "సుభాస్ చంద్ర బోస్" నుంచి]





Tuesday 19 March 2019

తప్పులెన్ను రాహుల్ తమ తప్పులెరుగడు !

జి.ఎస్. కుమార్
.............

నూటపాతికేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పప్పూజీకి  కేవలం ఎదుటి పార్టీల తప్పులే కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు . కానీ, ఆయన వేటినైతే తప్పులని చెబుతున్నారో అవి తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయని గుర్తించడానికి ఎన్ని రోజులు పడుతుందో మరి! అదీగాక, ఎదుటి పార్టీల విషయంలో ఆయన తప్పుపడుతున్న అంశాల వెనుక తమ పార్టీ 'హస్తం' కూడా ఉందన్న సంగతి ఆయన గుర్తెరగడానికి ఈ జన్మ సరిపోతుందో లేదో...


ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు సభల్లో గొంతు చించుకుంటూ ఆయన చేసే ప్రసంగాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే తప్ప, తన ప్రసంగాల్లో లేవనెత్తే అంశాలపై ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదని. తన ప్రసంగంలోని అంశాలను విపక్షాలు, మేధావులు, సాధారణ ప్రజలు సైతం విమర్శించి, పాయింట్లు దొరగ్గానే పట్టుకుంటారని ప్రధానమంత్రి పదవిని కోరుకుంటున్న రాహుల్ గ్రహించడం లేదు.

పుల్వామా దాడికి వ్యూహరచన చేసిన జైష్ ఏ మహ్మద్ వ్యవస్థాపకుడు ఉగ్రవాది మసూద్ అజార్‌ను 1999 నాటి కాందహార్ హైజాకింగ్ ఎపిసోడ్‌ సందర్భంగా నాటి బీజేపీ ప్రభుత్వమే విడిచిపెట్టిందని, అందువల్ల ప్రస్తుతం ఆ సంస్థ చేస్తున్న ఉగ్రవాదదాడులు, దాని తీవ్రవాద కార్యకలాపాలకు ఒక రకంగా బీజేపీయే కారణమని అంటారు రాహుల్. కానీ పుల్వామా దాడి కేవలం ప్రమాదమని ఆయన పార్టీలోని దిగ్విజయ్, కపిల్ సిబల్, సిద్దూ లాంటి సీనియర్, జూనియర్ నేతలు పేర్కొంటుంటే రాహుల్ మాత్రం జైష్ ఏ మహ్మద్‌ని, మసూద్ అజార్‌ని మళ్ళీ తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారో ఆయనకే తెలియాలి.

కాందహార్‌ విమాన హైజాక్‌లో బందీలైన 176 మంది ప్రయాణికులను కాపాడటం కోసం ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను విడిచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీయే సలహా ఇచ్చిందని కాంగ్రెస్ అధినేతకు బీజేపీ గుర్తు చేసింది. ఆ ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వాజ్‌పేయి అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుటు అన్ని పార్టీల నేతలతో పాటు నాడు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోనియా గాంధీ, మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారని, ప్రయాణికులను కాపాడ్డానికి మసూద్‌ను విడిచిపెట్టాలని సూచించారని బీజేపీ చెప్పింది. మరి కాంగ్రెస్ యువరాజావారు దీనికేమంటారో...

ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదుల్ని అయాచితంగా విడిచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌కే ఉందని విషయాన్ని ప్రధానస్రవంతిలోని మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా రాహుల్‌కి గుర్తు చేస్తోంది. కాస్త ఈ లింకు చూడండి...
https://www.ndtv.com/india-news/pak-terrorist-released-by-previous-government-struck-back-with-pathankot-1407168

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2010లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఎ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు షహీద్ లతీఫ్‌తో పాటు 20 మంది పాక్ ఉగ్రవాదుల్ని ఏ కారణమూ లేకుండానే విడిచిపెట్టేశారు. ఇంతమంది ఉగ్రవాదుల్ని ఎందుకు విడిచిపెట్టారో ఎవరికీ తెలియదు. 1999 నాటి హైజాకింగ్ ఘటనను తీసుకుంటే ఉగ్రవాదుల చేతిలో ఉన్న 176 మందిని కాపాడటానికి... సోనియా, మన్మోహన్ తదితర ప్రతిపక్షనేతల సలహాతోనే మసూద్ తదితర ముగ్గురు నలుగురు ఉగ్రవాదుల్ని అప్పటి బీజేపీ సర్కారు విడిచిపెట్టడం జరిగింది. మరి 2010లో అధికారంలో ఉన్న యుపిఎ సర్కారు 20 మంది ఉగ్రవాదుల్ని ఎందుకు వదిలేసిందో దేవుడికే ఎరుక. పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై జరిగిన దాడికి సూత్రధారి అయిన ఈ లతీఫ్ బృందమే 1999లో మసూద్‌ని విడుదల చేయించింది. ఇదంతా తెలిసి కూడా కాంగ్రెస్ 2010లో అతన్ని ఎందుకు వదిలేసింది? రాహుల్‌కి జవాబు తెలుసా?

Friday 15 March 2019

పాక్‌లో గెలవాలంటే భారత్‌ని తిట్టాలి! మరి భారత్‌లో గెలవాలంటే...?

జి.ఎస్.కుమార్
..........

పాకిస్తాన్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ గెలవాలంటే ఒకటే సూత్రం... అక్కడ ఏ పార్టీ అయినా సరే తమ ప్రత్యర్థి పార్టీపై దుమ్మత్తి పొయ్యడంతో పాటు మరోపని కూడా తప్పనిసరిగా చెయ్యాలి. అదేంటంటే... కశ్మీర్‌లో ఘోరాలు జరిగిపోతున్నాయని భారతదేశంపై నిందలు వేస్తూ... తాము అధికారంలోకి వస్తే భారత్ పని పడతామని ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పుకుని గగ్గోలు పెట్టాలి. కశ్మీర్‌పై తమకే చిత్తశుద్ధి ఉన్నట్టు నటించాలి. ఈ పని ఏ పార్టీ బాగా చేస్తే వారికే అధికారం దక్కేలా పాక్ సైన్యం కూడా శక్తివంచన లేకుండా సహకరిస్తుంది.

ఇక మన దేశంపైపు చూస్తే.. ఇన్నాళ్ళూ జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతోంది వేరు. మన రాజకీయ నాయకులు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం. పూల్వామా ఉగ్రదాడి... దానికి దీటుగా భారత బలగాల స్పందన చూశాక ప్రతిపక్ష నేతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ పరిణామం ఎక్కడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి లబ్ది చేకూర్చుతుందోనన్న ఆందోళనతో విపక్ష పార్టీలకు బీపీ పెరిగిపోయింది. ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకపార్టీని నిందించడంతో ఆగకుండా అనుక్షణం దేశాన్ని కంటికి రెప్పలా కాపు కాస్తున్న భారత సైన్యంపైనా నిందలు వేస్తూ ఎన్నడూ కనీవినీ ఎరుగనంత నైచ్యానికి ఒడిగడుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కే ప్రయోజనం చేకూర్చుతుందని, ఫలితంగా మన దేశానికే తలవంపులు తెస్తున్నామనే కనీస విజ్ఞత కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు.

ఇలా ప్రకటనలిస్తున్నవారిలో 125 ఏళ్ళ చరిత్ర కలిగిన చారిత్రక కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, సల్మాన్‌ ఖుర్షీద్‌, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రస్తుత, గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మమతా బెనర్జీ, మాయావతి, మెహబూబా ముఫ్తీ, కుమారస్వామి, సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేశ్... ఇలా మన దేశాన్ని, సైన్యాన్ని చులకన చేసి మాట్లాడేవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పుల్వామా ఉగ్రదాడి ప్రమాదమని... ఎన్నికలప్పుడే ఉగ్రవాద దాడి జరగడమేంటని... భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఉగ్రవాదుల్ని చంపిన సాక్ష్యాలు కావాలని... ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ళ కిందటే చెప్పారని.. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని...  ఇలా పేట్రేగిపోతూ మనదేశ ప్రతిపక్షనేతలు ప్రకటనలు చేస్తున్నారు. పొరుగుదేశంతో సమస్య వచ్చినప్పుడు మన సర్కారుకు, సైన్యానికి అండగా నిలబడకుండా అవమానిస్తున్న వీరందరి లక్ష్యమూ ఎన్నికల్లో తమ పార్టీల కోసం లబ్ది పొందడం కాక మరేమిటి?

పుల్వామా ఉగ్రవాద దాడికి ముందు కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నోసార్లు మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నెన్నో ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అప్పట్లో కూడా ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాక్ తీరును మన ప్రభుత్వాలతో పాటు విపక్ష పార్టీలు కూడా ప్రశ్నించాయి.... అప్పుడు (ఇప్పుడు కూడా) పాక్ ఎలా స్పందించేదంటే... "మా మీద అన్యాయంగా నిందలేస్తున్నారు... మా (పాక్ ఉగ్రవాదులు) హస్తం ఉన్నట్టు ఆధారాలు చూపించండి..." అని. విచిత్రమేంటంటే, పుల్వామా దాడుల తర్వాత కూడా భారత సర్కారు పాక్ తీరును ప్రశ్నిస్తే... పాకిస్తాన్ స్పందన రావడానికి ముందే వారి తరఫున ముందుగా కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి సిద్ధుతో మొదలుపెట్టి.. "అయ్యో పాకిస్తాన్‌ని నిందిస్తారా?" అంటూ ఏడుపు లంకించుకున్నాడు. ఈయన తర్వాత మనం పైన చెప్పుకున్న నేతాశ్రీలందరూ క్యూ కట్టి భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనుకుంటూ పాకిస్తాన్ తరఫున మన సైన్యాన్ని, సర్కారును నానా మాటలన్నారు. గతంలో ఇలాంటి సందర్భాలప్పుడు కేంద్ర సర్కారులకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్షపార్టీల వైఖరి ఈ సారి ఒక్కసారిగా ఎందుకు మారింది? ఎన్నికల్లో లబ్ధి కోసం కాదా?...

ఎప్పుడు పదవి పోతుందో అర్థంకాక రోజూ తలపట్టుకుని కూర్చునే కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా లైన్‌లోకి వచ్చేసి...  ఉగ్రవాదదాడులు ఇప్పుడే ఎందుకు జరగాలి? మా నాన్న (దేవెగౌడ) ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరగలేదు కదా? అంటూ మమతా బెనర్జీ, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచాడు. ఇదంతా కాదు గానీ అసలు అభినందన్ మా హయాంలోనే పైలట్‌గా వైమానిక దళంలో చేరాడంటూ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్‌ నేత ఖుర్షీద్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు.

పుల్వామా ఉగ్రవాదదాడి తమ పనేనని దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్, అతనితో ఆ పని చేయించిన జైష్ ఎ ఉగ్రవాదులు, జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడు అమ్మర్ వీడియోలు విడుదల చేశారు. చివరికి పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కూడా రంగంలోకి దిగి తన హయాంలో కూడా జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌పై పలు మార్లు దాడులు జరిపిందని స్పష్టం చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న బాలాకోట్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన ప్రతిదాడుల్లో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయని, పలువురు ఉగ్రవాదులు మరణించారని మన IAF ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలను అందజేసింది. అంతకు ముందే ఇటలీకి చెందిన ఒక మహళా పాత్రికేయురాలు ఈ విషయాన్ని ధృవీకరించింది.

మనల్నే కాపాడుతున్న మన సైనిక దళాలను అవమానపరచైనా మోదీ సర్కారును ఓడించాలని కంకణం కట్టుకున్న మన ప్రతిపక్ష నాయకులకు ఈ సాక్ష్యాలు, వీడియోలు కనిపిస్తాయనుకోవడం మన అత్యాశే... ఎందుకంటే తందానతాన అంటూ వాళ్ళకు వంతపాడే అనుకూల మీడియా సంస్థలు కూడా తోడున్నాయి మరి.

Wednesday 13 March 2019

కాంగ్రెస్ పేరెత్తితే వణుకుతున్న పాక్ ఉగ్రవాదులు

జి.ఎస్. కుమార్

...........

పాక్ ఉగ్రవాదులు మనదేశంలోని కాంగ్రెస్ నాయకుల పేరెత్తితే  వణికిపోతున్నారట!

పాకిస్తాన్‌లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ లాంటి పదవుల్లో ఉన్నవాళ్ళను సైతం పక్కనపెట్టి మరీ 'వీవీవీ...ఐపీ' ట్రీట్‌మెంట్ అందుకునేదెవరో తెలుసా? భారత్-పాక్ సరిహద్దుల దగ్గర కనీసం సీమటపాకాయనైనా తుస్సుమనిపించిన ట్రెయినీ ఉగ్రవాదితో మొదలుపెట్టి సీనియర్ మోస్ట్ ఉగ్రవాదుల వరకూ ఈ అరుదైన గౌరవాన్ని అక్కడ అందుకుంటుంటారు. ఇక అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ఐక్యరాజ్య సమితి రికార్డులకెక్కిన హఫీజ్ సయీద్, అదే బాటలో ఉన్న అజర్ మసూద్ లాంటి వారైతే దేశానికే అల్లుడి తరహాలో రాచమర్యాదలు అందుకుంటుంటారు. ఇలాంటి వారిని చైనా కూడా పాక్ పాలకులతో సమానంగా గౌరవిస్తుంటుంది.

అమెరికా చేతిలో అంతమైన అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్ పాక్ అండతోనే అబొట్టాబాద్‌లో అంతఃపురం లాంటి ఇంటిలో కొన్నేళ్ళపాటు సేదతీరిన సంగతి తెలిసిందే... ఉగ్రసంస్థ జైష్ ఎ మహ్మద్ అధినేత అజర్ మసూద్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలో మర్యాదలు అందుకుంటున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా పాకిస్తాన్‌లో గృహనిర్బంధం పేరిట పాక్ సైన్యం రక్షణలో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో ఉన్న మరో ఉగ్రవాది జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ అయితే రావల్పిండిలోని అడియాలా హైసెక్యూరిటీ జైల్లో ఉంటూనే జైలు అధికారుల అండదండలతో ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఇదీ పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకున్న అత్యున్నతస్థానం. ఈ కింది లింకులు చూస్తే లఖ్వీకి దక్కిన రాచ మర్యాదల గురించి మరింత వివరంగా తెలుసుకోగలుగుతారు..

https://www.bbc.com/news/world-asia-31606798

https://zeenews.india.com/news/south-asia/26/11-accused-zaki-ur-rehman-lakhvi-fathered-a-child-while-in-jail_1517118.html

ఇలా ఉగ్రవాదులకు సమస్త సుఖభోగాలను అందిస్తూ వారికి భూతలస్వర్గంలా అలరారుతోంది పాకిస్తాన్. ఇప్పుడు అక్కడి ఉగ్రవాదులకు కొత్త కష్టం వచ్చింది. అందుకు కారణం భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులే కావడం విశేషం. అదెలాగంటే... 40 మంది భారత జవాన్లను బలిగొన్న పుల్వామా ఘటనను ఉగ్రవాదదాడిగా కాకుండా కేవలం 'ప్రమాదం' అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈయనతో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేపీ మౌర్య కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


వీళ్ళ వ్యాఖ్యలపై ఆగ్రహంతో చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు. పుల్వామా దాడులతో పాకిస్తాన్‌లో ఇమేజి పెంచుకుని మరిన్ని మర్యాదలు అందుకోవాలనుకుంటున్న ఉగ్రవాదులకు ఇప్పుడు భారత రాజకీయ నేతల వ్యాఖ్యలు భయంతో కూడిన కోపం తెప్పిస్తున్నాయట. పుల్వామా దాడులు తమ పనేనని నొక్కి చెప్పుకుంటూ కష్టపడి రెండు వీడియోలు కూడా విడుదల చేసి పాక్ సైన్యం మెప్పు పొందాలనుకుంటుంటే... అవి ఉగ్రవాద దాడులు కాదనీ, కేవలం ప్రమాదమని ఈ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని పాక్ సైన్యం నమ్మితే తమకు పాక్ సర్కారు కల్పిస్తున్న భద్రత, సుఖభోగాలకు కారణమైన 'ఉగ్రవాది' హోదా రద్దవుతుందేమోనని పాక్ ఉగ్రవాదులు భయపడుతూ దిగ్విజయ్ లాంటి కాంగ్రెస్ నేతల పేరెత్తితే చాలు గడగడ వణికిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్న
హఫీజ్ సయీద్, జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో కంగారు పడుతున్నారట. ముంబై ఉగ్రదాడులతో పాటు భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడులన్నీ ప్రమాదమేనని రేపెప్పుడైనా కపిల్ సిబల్, నవజ్యోతి సింగ్ సిద్దు లాంటి కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితా నుంచి తమ పేర్లు కూడా తీసేస్తారేమో... అదే గనుక జరిగితే పాక్ సైన్యం తమను గాడిదల కంటే హీనంగా చూసి వదిలేస్తుందనీ... అప్పుడు కుక్కచావు తప్పదనీ భయపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారట.
 
మన రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో ఎంత అభాసుపాలవుతున్నామన్నది ఇప్పటికైనా తెలుసుకుని మేలుకుంటే మంచిదని సూచిస్తున్నారు నెటిజన్లు.

Sunday 10 March 2019

పాక్ భక్త సిద్దు ... సిగ్గు సిగ్గు !


జి.ఎస్.కుమార్

.....
పుల్వామా దాడులు జరిగిన తర్వాత... సిక్సర్ల సిద్దూగా ఒకప్పుడు క్రికెట్‌లో పేరు తెచ్చుకున్న ప్రస్తుత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ముందే పాకిస్తాన్‌ని వెనకేసుకొచ్చాడు. నెటిజన్లు ఆయన్ని ఆ చెంపా ఈ చెంపా వాయించడంతో నాలుగు రోజులు నోరు మూసుకున్నట్టు నటించాడు. కానీ... "భారత వైమానిక దళాలు మా చెట్లను మాత్రమే కూల్చాయి... మాకేం నష్టం కలగలేదు" అని పాక్ సైనిక వర్గాలు ఒక కల్లబొల్లి ప్రకటన చెయ్యగానే ఈ సిద్దూ మళ్ళీ ఒళ్ళు విరుచుకున్నాడు. "పాకిస్తాన్‌లో మనవాళ్ళు 300 మంది ఉగ్రవాదుల్ని ఏరేశారా.. చెట్లు కూల్చారా?" అని ట్వీట్ చేశాడు. పలువురు కాంగ్రెస్ నేతలు, వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా సిద్దు మార్గంలోనే నడిచారు. ఆ వెంటనే మన వైమానిక దళం అధికారులు రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బాలాకోట్‌లో తాము జరిపిన దాడులు, అక్కడ ఉగ్రవాద స్థావరాలకు కలిగిన నష్టాన్ని వివరించేలా 12 పేజీల ఉపగ్రహ చాయాచిత్రాలను విడుదల చేశారు.

భారత రాజ్యాంగ విధి విధానాల ప్రకారం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్రమంత్రిగా చట్టబద్ధమైన పదవిలో ఉన్న సిద్దు పాక్ చూపించే సాక్ష్యాలకు మాత్రం విలువనిచ్చి, పాకిస్తాన్‌కి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ మన దేశాన్ని నిరంతరం రక్షిస్తున్న మన దళాలను దారుణంగా అవమానిస్తున్నాడు. ఈయనకు మన దళాలు చూపించే సాక్ష్యాలు అవసరం లేదు. పాకిస్తాన్ గత, వర్తమాన చరిత్రలను పరిశీలిస్తే... ప్రత్యేకించి కార్గిల్ యుద్ధమప్పుడు... భారత సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ సైనికుల మృతదేహాలను... "వాళ్ళెవరూ మావాళ్ళు కాదు" అంటూ తీసుకోవడానికి నిరాకరించింది. అప్పుడు మనదేశమే పాక్ సైనికులకు గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు నిర్వహించింది. పాక్ సైనికుల క్రౌర్యానికి మరో ఉదాహరణ ఏమిటంటే, పలుమార్లు వాళ్ళు మన భూభాగంలోకి అడుగుపెట్టి మన జవాన్లను దారుణంగా చంపేశారు. మన జవాన్ల ప్రాణం తీసిన తర్వాత వదిలేయకుండా ఆ భౌతిక కాయాలపై రక్కిన గుర్తులు, ముఖాలు చెక్కేసిన ఆనవాళ్ళు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలు స్పష్టం చేశాయి. మానవత్వం అనే పదానికి చోటేలేని పాక్ సైన్యం ఇచ్చే సాక్ష్యాలకు రాష్ట్రమంత్రి హోదాలో ఉన్న సిద్దు ఇస్తున్న విలువ, ప్రకటనలు చూస్తే "కనకపు సింహాసనంబున..." అనే సుమతీ శతకకారుని పద్యం పదే పదే జ్ఞాపకం వస్తోంది.


ఒక పక్క పంజాబ్ రాష్ట్ర యువతరం మాదకద్రవ్యాల బారినపడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇదిగాక పలు సమస్యలున్నాయి. మంత్రి హోదాలో ఉన్న సిద్దు 24 గంటలూ పని చేసినా తరగనంత పని ఉంది. ఇవన్నీ పక్కనపడేసి "కపిల్ శర్మ షో" అనే ప్రముఖ టీవీ షోకి యాంకర్‌గా పనిచేస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్న సిద్దు ఇలా టీవీ షోలు చెయ్యడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తే... దానికి తాను పారితోషికం తీసుకోవడం లేదని, అది లాభదాయక పదవి కాదని అడ్డగోలుగా వాదించి ఆ షో చేసుకుంటూ వచ్చాడు. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌పై జాలి చూపిస్తూ సిద్దు మొదట చేసిన ప్రకటనతో "కపిల్ శర్మ షో" అనే ప్రముఖ టీవీ షో నుంచి అతన్ని తొలగించారు.

వింగ్ కమాండర్ అభినందన్‌ని పాక్ ప్రభుత్వం భారత్‌కు పంపినప్పుడు ఆయనకు స్వాగతం చెబుతానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా వాఘా వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. అయితే డిఫెన్స్ ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళలేదు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన అమరీందర్‌కు మన జవాన్ల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటే, ఆయన మంత్రివర్గంలో ఉన్న సిద్దు మాత్రం తన ప్రకటనలతో తన రాష్ట్రానికి, దేశానికి కళంకంగా మారాడు. మన దేశ సైన్యంలో విశేష సేవలందించిన పంజాబీ వీరులకు తలవంపులుగా మారాడు.

Sunday 3 March 2019

అభినందన్ మనకి... ఆనందం పాకిస్తాన్‌కి...

జి.ఎస్.కుమార్

............

తాజాగా కాంగ్రెస్ దిగ్గజనేత డిగ్గీరాజా అనబడే దిగ్విజయ్ సింగ్ అనే వృద్ధనేతకు గాభరా పుట్టింది. "పుల్వామా ఉగ్రదాడి, మన సైనికుల సర్జికల్ స్ట్రైక్స్ గురించి అందరూ మాట్లాడేస్తున్నారు... నేను మాట్టాడకపోతే నా పని ఐపోయిందనుకుంటార"ని కంగారుపడి ఉన్నట్టుండి తెరపైకి వచ్చారు. అభినందన్‌ని వదిలిపెట్టినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ని మెచ్చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ని అమెరికా సీల్స్ మట్టుబెట్టినప్పుడు ఆధారాలు చూపించారని, అలాగే పాకిస్తాన్‌పై మన సైన్యం తాజాగా చేసిన దాడులలో చనిపోయినవారికి సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ముందుగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. బిన్ లాడెన్‌‌ను అమెరికన్ సీల్స్ చంపిన ఆపరేషన్ వీడియో గానీ, అతని మృతదేహం ఫోటోలు గానీ అమెరికా బయటపెట్టలేదు. ఆ శవాన్ని ఎవరికీ చూపించలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జలసమాధి చెయ్యాలని నిర్ణయించుకుని లాదెన్‌ని చంపిన కొన్ని గంటల్లోనే ఆ పని కానిచ్చేశారు. ఇవేవీ అప్పటి పత్రికలు, టీవీ ఛానెళ్ళు సహా ప్రధాన మీడియాలో కనిపించలేదు. అమెరికన్ సీల్స్ ఎక్కుపెట్టిన తుపాకుల తూటాలతో కన్నాలు పడిపోయిన లాదెన్ ఫోటోలంటూ వెబ్ మీడియాలో కొన్ని ఫోటోలు వచ్చాయి గానీ అవి నిజమైనవి కావని ప్రధాన మీడియాకు చెందిన డిజిటల్ విభాగాలు స్పష్టం చేశాయి. కావాలంటే కింది లింకు చూసుకోవచ్చు....

https://www.theguardian.com/world/2011/may/02/osama-bin-laden-photo-fake

ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ పరిసరాల్లోని ఉగ్రశిబిరాలపై భారత సైన్యం చేసిన దాడుల్లో వారికి చెప్పుకోదగిన నష్టం జరిగి ఉండకపోతే, పాక్ వైమానిక దళాలు మన సైనిక స్థావరాలను ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. అలా వచ్చిన పాక్ వైమానిక దళాలను తరుముకుంటూ వెళ్ళినప్పుడే కదా మన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్ళడం, అతన్ని బంధించడం, భారత ప్రభుత్వ తీవ్ర హెచ్చరికల నడుమ 60 గంటల్లో అతను తిరిగిరావడం చకచకా జరిగిపోయాయి. మన సామర్థ్యానికి ఇవి సాక్ష్యాలని కాంగ్రెస్ వారికి ఎప్పటికీ అనిపించదు. బాలాకోట్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన జైషే మహమ్మద్ నేతలు మళ్ళా పుల్వామా తరహా దాడులు చేస్తామని వీడియోలు విడుదల చేశారు. జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడు అమ్మర్ మార్చి 2న ఆడియో టేపు ద్వారా స్పందించాడు. కాశ్మీరులో జిహాద్ కోసం శిక్షణ పొందుతున్న తమ రిక్రూటర్ల శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసిందని స్పష్టంగా చెప్పాడు. మన సైన్యం చేతలకు ఇది సాక్ష్యం కాదా?...


బాలాకోట్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలిందని ఇటలీకి చెందిన ఒక మహిళా జర్నలిస్టు క్షేత్రస్థాయిలోని పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ఇచ్చిన కథనం ఒకపక్కన కదలాడుతున్నా కొన్ని మీడియా సంస్థలకు అవేవీ పట్టవు. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌కు గానీ, ఉగ్రవాదులకు గానీ నష్టమేదీ జరగలేదని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంటున్నాయంటూ వాటికెందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇదే నిజమైతే భారత సైనిక స్థావరాలపైకి అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 విమానాలతో పాక్ దళాలు ఎందుకు వచ్చాయి? అసలు ఉగ్రవాదుల వేటకు మాత్రమే వాడాల్సిన ఈ విమానాలను భారత్ పై దాడికి ఎందుకు వాడారని పాక్ సర్కారును అమెరికా నిలదీసి వివరణ అడిగింది. ఇవేవీ మన ప్రతిపక్షాలకు, మీడియా సంస్థలకు అవసరం లేదు.

అభినందన్ పాక్ అదుపులో ఉన్నప్పుడు అతని నుంచి భారత సైనిక రహస్యాలు సహా అతని వ్యక్తిగత వివరాలన్నీ రాబట్టేందుకు పాక్ సైనికాధికారులు ప్రయత్నించారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. కానీ ఈ విషయంలో మన మీడియా ప్రవర్తించిన తీరు మరీ ఘోరం. ఒకవైపు అభినందన్ దేశరహస్యాలు కాపాడే ప్రయత్నంలో ఉంటే, పాకిస్తాన్ శ్రమపడకుండానే అతని కుటుంబం గురించిన వివరాలన్నీ మన మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మన టీవీ చానెల్ ఒకటి గతంలో అభినందన్ బృందంతో చేసిన ఇంటర్వ్యూల ఫీడ్ కూడా పాక్‌కు చేరింది. చివరికి లోక్‌సభ ఎన్నికల ముందు యుద్ధం జరుగుతుందని బీజేపీ నేతలు తనతో రెండేళ్ళ కిందటే అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారంటూ పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ పత్రిక డాన్‌తో పాటు అక్కడి పలు మీడియా సంస్థలు కథనాలిచ్చాయి. దీనిపై పవన్ మార్చి 2న స్పందిస్తూ ప్రముఖ వార్తా ఛానెళ్ళు, రాజకీయ విశ్లేషకులే వ్యాఖ్యలకు ఆధారమన్నాడు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్న పవన్ మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? ఈ లింకులు చూడండి...
https://epaper.andhrajyothy.com/c/37257305

https://www.dawn.com/news/1466936



ఎన్నికల సమయంలో ఉగ్రవాద దాడులు జరగడమేంటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు... వీటిపై చర్చలు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిస్పందన.. పాకిస్తాన్‌పై నిందలేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్, పంజాబ్ మంత్రి సిద్ధూల కన్నీరు... పాక్ కంట పన్నీరు... ఇదీ స్వతంత్ర భారతావనిలో నాయకత్వం తీరు.

అసలు ఒక దేశంపై పొరుగు దేశం నుంచి దాడి జరిగి విలువైన ప్రాణాలు పోతే... బాధిత దేశంలోని ప్రతిపక్షపార్టీలు లేదా మీడియా ఆ పొరుగు దేశం మీద జాలి చూపించడం మీరెక్కడైనా చూశారా? ఇప్పటివరకూ చూడకపోతే ఇప్పుడు చూడండి... భారతదేశంలో జరుగుతోంది అదే. పుల్వామా వద్ద 40 మంది భారత జవాన్లను పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదదాడులు బలిగొన్న తర్వాత, మన మీడియా, ప్రతిపక్ష నేతల, ప్రకటనలను గమనించండి. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి మన ధనమానప్రాణాలను కాపాడుతున్న సైనికులను లక్ష్యం చేసుకుని వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అన్నం పెట్టే చేతిని నరికే నీచనికృష్టుల్లాగా... సైనికులపై నిందలు వేస్తూ పరమ కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరు పాకిస్తాన్‌కి ఉపశమనం కలిగించేలా ఉంది తప్ప... తాము కూర్చున్న కొమ్మను తామే నరుకుతున్నామన్న కనీస ఇంగిత జ్ఞానం లేదు. మన దేశంలో ఇలాంటి వాళ్ళుంటే పాకిస్తాన్‌కు అంతకంటే ఇంకేం కావాలి? ఐక్యరాజ్యసమితి మద్దతు కూడా అవసరం లేదు. మన మీడియా కంటే సోషల్ మీడియాలోని నెటిజన్లు పరిపక్వత ప్రదర్శిస్తున్నారు, ఈ నేతలకంటే సాధారణ పౌరులు విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు.

Tuesday 19 February 2019

భయపడకు ఇమ్రాన్.. మావాళ్ళున్నారులే !!

జి.ఎస్. కుమార్

................

జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ దార్ పుల్వామాలో 40 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకుని నాలుగు రోజులు గడిచింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలకు ఎలా బదులిచ్చుకోవాలో తెలియక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాలుగు రోజులు ఇల్లుదాటి బయటకు రాలేదు. కానీ, ఆ దాడి జరిగిన రోజు నుంచి పలువురు భారత నేతలు 'అయ్యో పాకిస్థాన్ పై నిందలు వేస్తున్నారే..' అంటూ చేసిన వ్యాఖ్యలు విని ఇమ్రాన్‌కు ధైర్యం వచ్చింది. మంగళవారం (19 ఫిబ్రవరి) నాడు మీడియా ముందుకొచ్చి పాత పాటే పాడాడు. పుల్వామా దాడితో పాక్‌కు సంబంధం లేదని, అన్యాయంగా తమపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని, యుద్ధం జరిగితే సిద్ధమేనని, తిప్పికొడతామని పాకిస్థాన్ పాత ప్రధానులు, అధ్యక్షుల మాటల్ని వల్లెవేశాడు.


ఇమ్రాన్‌కు ధైర్యం నూరి పోసిన ఆ భారతీయులెవరనేది తెలియాలంటే ఇమ్రాన్ మీడియా ముందుకొచ్చిన మంగళవారం నాటి పత్రికలు తిరగేస్తే సరిపోతుంది. అసలు దాడి జరిగిన రోజునే పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ శివాలెత్తిపోయాడు. పంజాబ్‌ను ఏమన్నా ఫరవాలేదు గానీ... అమాయక పాకిస్తాన్‌ను పల్లెత్తు మాట అనొద్దు... అన్నట్టుగా ఉన్నాయి అతని వ్యాఖ్యలు. ఇదంతా పిరికిపందల చర్య అని, వారి దుశ్చర్యలకు పాకిస్తాన్‌ని నిందించడమేమిటని పొర్లి పొర్లి ఏడ్చాడు... ఇది చాలక తాను నిన్న మొన్నటి వరకూ బీజేపీలోనే ఉన్న సంగతి మర్చిపోయి 1999 నాటి కాందహార్ సంఘటనలో హస్తమున్నవారిని విడిచిపెట్టిందెవరని ఇప్పుడు అడుగుతున్నాడు.

ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కూడా పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలే చేశాడు. పాకిస్తాన్ పాత్రపై ఆధారాలుంటే చూపాలన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారత కశ్మీరీ అయితే పాకిస్తాన్‌ని నిందిస్తారా? అంటూ నికార్సైన పాకిస్తాన్ పౌరుడిలా భారత ప్రభుత్వాన్ని నిలదీశాడు.

చట్టబద్దమైన పదవిలో ఉన్న సిద్దు, సామాజిక కార్యకర్తగా ఎందరినో ప్రభావితం చేయగల స్థానంలో ఉన్న స్వామి అగ్నివేశ్ ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని సామాన్య పౌరులు సైతం చీదరించుకుంటున్నారు. ఆదిల్ దార్‌తో ఈ ఘోరం చేయించిన ఉగ్రవాద సంస్థ జైషేమహమ్మద్ సంస్థ అతనితో రికార్డ్ చేసిన రెండు వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ జైషేమహమ్మద్ అధినేత మసూద్‌ అజర్‌ పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నాడు. ఇతని కుడి భుజం ఘాజీ రషీద్ నుంచే ఆదిల్ దార్ ఉగ్రవాద శిక్షణ పొందినట్లు ఆధారాలన్నీ బయటకొచ్చాయి. ఈ లోగా మంగళవారం నాడు జైషేమహమ్మద్ సంస్థ మరో వీడియో విడుదల చేసి పుల్వామా తరహా దాడి మరొకటి చేస్తామని హెచ్చరించింది. సిద్దూకి, అగ్నివేశ్‌కి ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి?

గత ప్రభుత్వాల పాలనలోనూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలో ఇలాంటి దాడులు చేసిన సంగతి తెలిసిందే... అప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా పాకిస్తాన్‌ని నిందించాయి. మరి ఆనాడు ఈ సిద్దు, అగ్నివేష్‌లు ఆధారాలు ఎందుకు అడగలేదు?

సిద్దు, అగ్నివేశ్‌ల ఆవేశం తగ్గిందో లేదో.. తాను మాట్లాడకపోతే కొంపమునిగిపోతుందన్నట్టు తమిళనాడు నుంచి కమల్ హాసన్ సీన్‌లోకి వచ్చాడు.  కశ్మీర్‌లో ఫ్లెబిసైట్ అంటూ వ్యాఖ్యలు చేసి చరిత్రకు సంబంధించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఈ విశ్వరూపుడికి కశ్మీర్‌లో పండిట్ల కష్టాలకు కారకులెవరో, లక్షలాది మంది పండిట్లను కశ్మీర్ నుంచి తరిమేసిందెవరో అవసరం లేదు. ప్లెబిసైట్ ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అక్కర్లేదు. ప్లెబిసైట్ ఫలితాన్ని బట్టి కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కి ఇచ్చేయాలని లేదా ప్రత్యేక దేశం చెయ్యాలని అడిగేవారిలో బహుశా ఈయనే ముందుంటాడేమో...

భారత్‌లో సిద్దూ , అగ్నివేశ్ , కమల హాసన్ లాంటివారున్నప్పుడు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు అంతకంటే ఇంకేం కావాలి?

Monday 18 February 2019

ఇంత ఘోరం జరిగినా ఆ ఫోటో అక్కడే ఉంది...

జి.ఎస్. కుమార్

..............
మన రక్షణ కోసం జీవితాల్ని అంకితం చేసిన 40 మంది జవాన్లను కోల్పోయి జాతి యావత్తూ కన్నీరు పెడుతోంది. అసలు ఈ కన్నీటికి కారణం పాక్ ప్రేరేపిత ఉగ్రభూతం కాగా... ఆ ఉగ్రవాదానికి మూలం మహమ్మద్ అలీ జిన్నా వల్ల జరిగిన దేశవిభజన. ఆ జిన్నా ఫోటో ఇప్పటికీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)లో భారత్‌ను వెక్కిరిస్తూ వేలాడుతూనే ఉంది. దేశ విభజనకు కారకుడై లక్షలాది ప్రజల జీవితాల్ని అథోగతి పాలు చేసిన ఈ జిన్నా ఫోటోను తొలగించేందుకు ప్రయత్నిస్తే గతేడాది ఎంత గొడవ చేశారో తెలియంది కాదు. అక్కడి జిన్నా ఫోటోకు ఓటు వేసినవారిలో కాంగ్రెస్ నేతలు కూడా ఉండటం దురదృష్టకరం.

ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పేలా కీలక నిర్ణయం తీసుకుంది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA). మొహాలీ క్రికెట్ స్టేడియంలోని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, గ్యాలరీ, లాంగ్‌ రూమ్‌, రిసెప్షన్‌ తదితర ప్రదేశాల్లో ఉన్న 15 మంది పాకిస్థాన్ ఆటగాళ్ల ఫొటోలటన్నింటినీ తీసి పక్కన పడేసింది. వీటిలో పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌, జావేద్‌ మియాందాద్‌, వసీమ్‌ ఆక్రమ్‌, అఫ్రీది ఫోటోలున్నాయి.


ఇక జిన్నా ఫోటో ఇంకా ఏఎంయులో ఎందుకని అడిగితే... ఆయనకు స్టూడెంట్ యూనియన్ సభ్యత్వం ఉందని, పైగా అదెప్పుడో ఆయన పాకిస్తాన్ డిమాండ్ చెయ్యక ముందటి ఫోటో అని కథలు చెబుతున్నారు. అలాగైతే హిట్లర్, ముస్సోలినీ లాంటి క్రూర నియంతల చిన్నప్పటి ఫోటోలు పెట్టుకుని... వీళ్ళు పెద్దయ్యాక కదా తప్పులు చేసిందని పూజలు చేస్తారా? PCA నిర్ణయం తెలిస్తే... దేశవిభజనకు, ఉగ్రవాదానికి నేరుగా సంబంధాలు లేని పాక్ క్రికెటర్ల ఫోటోలు ఎందుకు తొలగించారని కూడా రేపోమాపో ప్రశ్నిస్తారేమో... ఇలా ఉన్నాయి వీళ్ళ తెలివి తేటలు. ఆ వివాదం తర్వాత గతేడాది అక్టోబర్ నెలలో AMUలో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో గాంధీ-జిన్నాలు పక్కపక్కనే ఉన్న ఫోటోలను ప్రదర్శించారు.


ఒకవైపు దేశంలో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అందరూ ఏకమవుతున్నారు. చైనా, పాక్ తప్ప ప్రపంచమంతా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. గత నాలుగైదు రోజుల్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించడం, పోలీసులు కేసులు పెట్టి విచారణ చేపట్టడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా... ఈ మొత్తం దుష్పరిణామాలకు మూలమైన పాకిస్తాన్ కన్నతండ్రి జిన్నా ఫోటో మాత్రం.. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ లో - మన చేతగాని సర్కారులను, జవాన్ల త్యాగాలను వెక్కిరిస్తూ ఇంకా అక్కడే ఉంది.

Sunday 17 February 2019

సిగ్గులేని మీడియా... సైన్యం పరువు తీస్తోంది*

జి.ఎస్. కుమార్

.........

కశ్మీర్‌లో ఉగ్రవాది ఆదిల్ దార్ నీచ కృత్యానికి 40 మంది జవాన్లు బలైపోయి జాతి యావత్తూ కంటతడి పెడుతుంటే, ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన ఒక వార్త ఉగ్రవాదికి వత్తాసు పలికేలా ఉంది. అమరులైన జవాన్ల ప్రాణత్యాగానికి తగిన నివాళి అర్పించడం వదిలేసి పరమ నీచస్థాయికి దిగజారిపోయింది మన మీడియా. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ చిన్నప్పుడు సైన్యం చేతిలో అవమానం పాలయ్యాడని, అందువల్లే అతను కక్ష పెంచుకుని ఈ పాపానికి ఒడిగట్టాడంటూ ఉగ్రవాది పట్ల సానుభూతి కలిగేలా అతని తల్లిదండ్రులు చెప్పిన విషయాల్ని గొప్ప వార్తగా చిత్రీకరించి జనం మీదకు వదిలారు.

అదే నిజమైతే, దాడికి మూలకారణమైన ఈ విషయాన్ని "మీరు ఈ వీడియో చూసేసరికి నేను స్వర్గంలో ఉంటా"నని దాడికి ముందు ఆదిల్ విడుదల చేసిన వీడియోలో ఎందుకు ప్రస్తావించలేదు? ఆ వీడియోను చిత్రీకరించిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు కూడా ఆ మాటలు రికార్డ్ చేయించే వారు కదా? ఆదిల్ తల్లిదండ్రులు మరో మాట కూడా చెప్పారని మన మీడియా రాసింది. అదేంటంటే... భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా ఆదిల్ భారత్‌కే మద్దతు పలికేవాడట. ఇదంతా అస్సలు పొంతన లేకుండా ఉందని మన మీడియా ఆ మాత్రం గ్రహించలేక పోయిందా? భారత సైన్యం చేతిలో అవమానం పాలై ఈ దేశాన్ని ద్వేషించి ఉగ్రవాది అయిన అదిల్, క్రికెట్ విషయంలో మాత్రం భారత్‌ను ప్రేమిస్తున్నాడంటే నమ్మాలా...

ఆ వీడియోలో ఆదిల్ మరో విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. గోమూత్ర సేవనం చేసేవారి ప్రాణాలు తీయడమే తన లక్ష్యమన్నాడు. అంటే హిందువులే తన టార్గెట్ అని తేల్చి చెప్పాడు. ఇది పూర్తిగా మతపరమైన దాడి అని తెలుస్తూనే ఉంది. మరి మీడియా ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చెయ్యలేదు? వాస్తవాలను దాచాల్సిన అవసరమేంటి? ఇది ఇస్లామిక్ టెర్రర్ కాదా? హిందువుల విషయంలో అయితే ఏమీ లేనిదానికే హిందూ టెర్రర్ అని గగ్గోలు చేసిన మీడియాకు ఆదిల్ చేసిన పని ఇస్లామిక్ టెర్రర్ అనిపించలేదా? ఇదంతా మన పిరికిపంద మీడియా చేతగానితనం తప్ప మరొకటి కాదు.


ఇక Times of India తీరు మరీ ఘోరంగా ఉంది. దాడి చేసిన ఉగ్రవాది ఆదిల్ local youth అట. భారత ప్రభుత్వమే పాకిస్తాన్ పై నిందలు వేస్తోందట. ఆదిల్ ద్వారా ఈ దారుణం చేయించింది జైషే మహ్మద్ అని స్పష్టంగా తెలిసి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ పాక్ తీరును తప్పు పడుతుంటే Times of India లాంటి పత్రికలు మాత్రం భారత ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నాయి. ఈ చర్య మన అమర జవాన్లను అవమానించడమే. మీడియా నైచ్యానికి పరాకాష్ట ఇది.

ఇదిలా ఉంటే, ఆప్ఘనిస్థాన్ నుంచి సేనల్ని ఉపసంహరించుకోవాలన్న అమెరికా నిర్ణయం తమ విజయమేనని తాలిబన్లు చేసిన ప్రకటన స్ఫూర్తితోనే అదిల్ సూసైడ్ బాంబర్‌గా మారాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త ప్రచురించింది.
https://timesofindia.indiatimes.com/india/pulwama-suicide-bomber-was-inspired-by-taliban-victory-over-us-in-afghanistan/articleshow/68000323.cms

*దాడికి ముందు ఆదిల్‌తో రెండు వీడియోల్ని జైషే మహ్మద్ సంస్థ రికార్డ్ చేయించింది. ఈ రెండు వీడియోల్లోనూ సైన్యం చేతిలో అవమానం గురించి అతను మాట్లాడలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన తమ కుమారుడి పట్ల, తన కుటుంబం పట్ల సమాజంలో ద్వేషం కలుగుతుందేమోనన్న భయంతో సానుభూతి కోసం ఆదిల్ తల్లిదండ్రులు ఈ ప్రకటన చేసి ఉంటారు. కానీ, మీడియాకు బుర్ర ఉండాలి కదా. ఆ ప్రకటన ముందువెనుకలు ఆలోచించకుండా జనం మీదకు వదలటం ఎంతవరకూ సబబు?

ఈ సందర్భంగా మన మీడియా ఒక ముఖ్యమైన విషయాన్ని ఘోరంగా పక్కన పడేసింది...  ఒకనాడు ఉగ్రవాదిగా ఉన్న నజీర్ అహ్మద్ వాని ఆ తర్వాత వాస్తవాలు గ్రహించి ఆ మార్గాన్ని వదిలేస్తే భారత సైన్యం అక్కున చేర్చుకుని జవానుగా సేవలందించే భాగ్యం కలిగించింది. అతను కూడా అంతే చిత్తశుద్ధితో దేశం కోసం పనిచేసి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. అతని త్యాగాన్ని భారత ప్రభుత్వం గుర్తించి మరణానంతరం అశోక్ చక్ర అవార్డుతో గౌరవించింది. అలాంటి మన సైన్యం ఆదిల్‌ని అవమానించిందని ఆ కుటుంబం చెప్పడం... అది నమ్మి వార్తలివ్వడం ఎంత సిగ్గు చేటు?

*125 ఏళ్ల కిందట స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగంతో మన దేశం పట్ల విదేశీయులకు ఎంతో గౌరవం పెరిగింది. ఎందరో ఆయన శిష్యులై ఈ దేశానికి వచ్చారు. మన జాతి ఔన్నత్యాన్ని గురించి విదేశీయులు అర్థం చేసుకున్నారు గానీ, మన స్వదేశీ మీడియాకు ఇవేమీ అక్కర్లేదు. వీళ్ళను మార్చడానికి ఆయన మరోసారి పుట్టాలేమో...*

Tuesday 29 January 2019

హిందువుల హక్కుల మాటేమిటి ?

Friday 25 January 2019

తెలుగు సిరి సిరి వెన్నెల


పమిడికాల్వ మధుసూదన్

..........

తెలుగు పాట అంపశయ్య మీద ఉంది . ఉత్తరాయణ పుణ్యకాలంకోసం ఊపిరి బిగబట్టి ముందుగానే ఊర్ధ్వలోకం కలలు కంటోంది . మైఖేల్ జాక్సనే మూర్ఛపోయే మూర్చనలతో తెలుగు పాట ఇంగ్లీషు పక్షపాతం , పక్షవాతంతో పల్లవి చరణాల కాలుచేతులు నిలువెల్లా కొట్టుకుంటున్నాయి . చెవులు చిల్లులు పడే వాద్య హోరులో మాటలు తమకు తాముగా పాడె మీద పదాల పిడకలు పేర్చుకున్నాయి .
కే అంటే ఐ అంటే ఎస్ అంటే అంటూ అక్షరాలు విరిగి విరిగి ఒకటో ఎక్కం కూడా గుర్తులేకుండా చేశాయి . భావం పాతాళంలో సంతలో తప్పిపోయిన పసిపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తోంది . తెలుగుపాటలో తెలుగుపదాలు , పలుకుబళ్లు , జాతీయాలు , వాడుకమాటలు , మాండలికాలు , తనదయిన వ్యక్తీకరణలు ఇంగువకట్టిన గుడ్డగా అయినా మిగల్లేదు . తెలుగు చదవలేని , రాయలేని , పొరపాటునకూడా మాట్లాడలేని , మాట్లాడకూడని హీరో హీరో ఇన్ ల ఇంగ్లీషు వాగ్ వైభవ వెస్ట్రన్ ప్రవాహంలో నిలువనీడలేక తెలుగు భాషా సరస్వతి ఆంధ్ర , తెలంగాణా పల్లెల్లో చదువురాని వారి గడపదాటి రావడంలేదు . షేక్స్ పియర్ ను చంపి పుట్టిన తెలుగు జాతి ఇప్పుడు పుట్టీ పుట్టగానే ఇంగ్లీషులోనే ట్విన్కిల్ ట్విన్కిల్ అని ఏడుస్తోంది . ఆపై ఉత్తమగతులకు , అమెరికా డాలర్ల సేద్యానికి కే జీ టు పీ జీ ఇంగ్లీషునే పీల్చి , తిని ,తాగి జీర్ణం చేసుకోవాలి కాబట్టి తెలుగు మన మెదళ్ల సాఫ్ట్ వేర్ లోనే ఎప్పుడో డిలిట్ అయిపొయింది . యథా ప్రేక్షక - తథా చిత్రం . ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ? సారాంశం - సినిమాలు అభిమానులు అందరం ఇంగ్లీషునే మేస్తూ , మోస్తూ దాని పేరు తెలుగు అనుకుంటూ మురిసిపోతున్నాం .



ఇలాంటి బాధలు , నిట్టూర్పులు , ఆవేదనలు , ఆక్రోషాలు అన్నిటికీ సమాధానం సిరివెన్నెల కలం . తొలితరం మల్లాది , సముద్రాల , పింగళి నుండి నిన్నటి వేటూరి వరకు ఆ తెలుగుపాటలతోటమాలుల వరుసలో చివర అంత భారాన్ని మోస్తున్నవాడు , మోయకతప్పనివాడు ,మోయగలిగినవాడు సిరివెన్నెల .

సూర్యుడి కిరణాలను పగటి వీణకు తంత్రులుగా బిగిస్తాడు . జామురాతిరిని జాబిలమ్మ పాటతో జోకొడతాడు . తెలిమంచులో తేలిపోతాడు . ఇలగొంతులో పలుకు అవుతాడు . జాలిగా జాబిలమ్మను రేయి రేయి అంతా రెప్పవేయకుండా ఓదారుస్తాడు . ఎంతవరకు ఎందుకొరకు గమ్యం వైపు ఆగకుండా దూసుకుపోతాడు . పాటను పంచామృతం చేసి తీర్థంగా పంచుతాడు . పదాలను నిప్పులుగా చేసి సిగ్గులేనివారిని అగ్గితో కడుగుతాడు . మైనింగ్ మాఫియాల మధ్య కృష్ణం వందే జగద్గురుమ్ అంటూ దశావతారాల పాట పాడతాడు . అణిమ గరిమ మహిమ లాంటి పారిభాషిక ప్రత్యేక నిఘంటువుల్లో తప్ప బయట దొరకని మాటలను తెలుగుపాటలో బంధిస్తాడు . రాత్రి దిగిన సూర్యుడిని పట్టి తూర్పుకు లాక్కొస్తాడు . మత్తు వదిలిస్తాడు . బుద్ధి చెబుతాడు . హెచ్చరిస్తాడు . మనం అడగలేని , మనకు అడగడం చేతకాని ప్రశ్నలను అడుగుతాడు . మూగబోయిన మన గొంతు తానవుతాడు . తెలుగు పాట మూగబోకుండా తను పదమవుతాడు . పాటలో తెలుగు దీపం కొడిగట్టకుండా తన పద పాదాల చేతులు అడ్డుపెట్టి ఉన్నాడు .

తనువు , మనసు , ఆలోచనలు అంతా వెన్నెల స్నానం చేస్తున్నవాడి చెంత ఇది ఒక పద్మం .

-
madhupamidikalva@gmail.com
9989090018