Wednesday 13 March 2019

కాంగ్రెస్ పేరెత్తితే వణుకుతున్న పాక్ ఉగ్రవాదులు

జి.ఎస్. కుమార్

...........

పాక్ ఉగ్రవాదులు మనదేశంలోని కాంగ్రెస్ నాయకుల పేరెత్తితే  వణికిపోతున్నారట!

పాకిస్తాన్‌లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ లాంటి పదవుల్లో ఉన్నవాళ్ళను సైతం పక్కనపెట్టి మరీ 'వీవీవీ...ఐపీ' ట్రీట్‌మెంట్ అందుకునేదెవరో తెలుసా? భారత్-పాక్ సరిహద్దుల దగ్గర కనీసం సీమటపాకాయనైనా తుస్సుమనిపించిన ట్రెయినీ ఉగ్రవాదితో మొదలుపెట్టి సీనియర్ మోస్ట్ ఉగ్రవాదుల వరకూ ఈ అరుదైన గౌరవాన్ని అక్కడ అందుకుంటుంటారు. ఇక అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ఐక్యరాజ్య సమితి రికార్డులకెక్కిన హఫీజ్ సయీద్, అదే బాటలో ఉన్న అజర్ మసూద్ లాంటి వారైతే దేశానికే అల్లుడి తరహాలో రాచమర్యాదలు అందుకుంటుంటారు. ఇలాంటి వారిని చైనా కూడా పాక్ పాలకులతో సమానంగా గౌరవిస్తుంటుంది.

అమెరికా చేతిలో అంతమైన అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్ పాక్ అండతోనే అబొట్టాబాద్‌లో అంతఃపురం లాంటి ఇంటిలో కొన్నేళ్ళపాటు సేదతీరిన సంగతి తెలిసిందే... ఉగ్రసంస్థ జైష్ ఎ మహ్మద్ అధినేత అజర్ మసూద్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రిలో మర్యాదలు అందుకుంటున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కూడా పాకిస్తాన్‌లో గృహనిర్బంధం పేరిట పాక్ సైన్యం రక్షణలో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో ఉన్న మరో ఉగ్రవాది జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ అయితే రావల్పిండిలోని అడియాలా హైసెక్యూరిటీ జైల్లో ఉంటూనే జైలు అధికారుల అండదండలతో ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఇదీ పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకున్న అత్యున్నతస్థానం. ఈ కింది లింకులు చూస్తే లఖ్వీకి దక్కిన రాచ మర్యాదల గురించి మరింత వివరంగా తెలుసుకోగలుగుతారు..

https://www.bbc.com/news/world-asia-31606798

https://zeenews.india.com/news/south-asia/26/11-accused-zaki-ur-rehman-lakhvi-fathered-a-child-while-in-jail_1517118.html

ఇలా ఉగ్రవాదులకు సమస్త సుఖభోగాలను అందిస్తూ వారికి భూతలస్వర్గంలా అలరారుతోంది పాకిస్తాన్. ఇప్పుడు అక్కడి ఉగ్రవాదులకు కొత్త కష్టం వచ్చింది. అందుకు కారణం భారతదేశంలోని కొందరు రాజకీయ నాయకులే కావడం విశేషం. అదెలాగంటే... 40 మంది భారత జవాన్లను బలిగొన్న పుల్వామా ఘటనను ఉగ్రవాదదాడిగా కాకుండా కేవలం 'ప్రమాదం' అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈయనతో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేపీ మౌర్య కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


వీళ్ళ వ్యాఖ్యలపై ఆగ్రహంతో చెడుగుడు ఆడుకున్నారు నెటిజన్లు. పుల్వామా దాడులతో పాకిస్తాన్‌లో ఇమేజి పెంచుకుని మరిన్ని మర్యాదలు అందుకోవాలనుకుంటున్న ఉగ్రవాదులకు ఇప్పుడు భారత రాజకీయ నేతల వ్యాఖ్యలు భయంతో కూడిన కోపం తెప్పిస్తున్నాయట. పుల్వామా దాడులు తమ పనేనని నొక్కి చెప్పుకుంటూ కష్టపడి రెండు వీడియోలు కూడా విడుదల చేసి పాక్ సైన్యం మెప్పు పొందాలనుకుంటుంటే... అవి ఉగ్రవాద దాడులు కాదనీ, కేవలం ప్రమాదమని ఈ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని పాక్ సైన్యం నమ్మితే తమకు పాక్ సర్కారు కల్పిస్తున్న భద్రత, సుఖభోగాలకు కారణమైన 'ఉగ్రవాది' హోదా రద్దవుతుందేమోనని పాక్ ఉగ్రవాదులు భయపడుతూ దిగ్విజయ్ లాంటి కాంగ్రెస్ నేతల పేరెత్తితే చాలు గడగడ వణికిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్న
హఫీజ్ సయీద్, జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ కూడా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో కంగారు పడుతున్నారట. ముంబై ఉగ్రదాడులతో పాటు భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడులన్నీ ప్రమాదమేనని రేపెప్పుడైనా కపిల్ సిబల్, నవజ్యోతి సింగ్ సిద్దు లాంటి కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితా నుంచి తమ పేర్లు కూడా తీసేస్తారేమో... అదే గనుక జరిగితే పాక్ సైన్యం తమను గాడిదల కంటే హీనంగా చూసి వదిలేస్తుందనీ... అప్పుడు కుక్కచావు తప్పదనీ భయపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారట.
 
మన రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో ఎంత అభాసుపాలవుతున్నామన్నది ఇప్పటికైనా తెలుసుకుని మేలుకుంటే మంచిదని సూచిస్తున్నారు నెటిజన్లు.

No comments:

Post a Comment