Tuesday 19 March 2019

తప్పులెన్ను రాహుల్ తమ తప్పులెరుగడు !

జి.ఎస్. కుమార్
.............

నూటపాతికేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ పప్పూజీకి  కేవలం ఎదుటి పార్టీల తప్పులే కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు . కానీ, ఆయన వేటినైతే తప్పులని చెబుతున్నారో అవి తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగాయని గుర్తించడానికి ఎన్ని రోజులు పడుతుందో మరి! అదీగాక, ఎదుటి పార్టీల విషయంలో ఆయన తప్పుపడుతున్న అంశాల వెనుక తమ పార్టీ 'హస్తం' కూడా ఉందన్న సంగతి ఆయన గుర్తెరగడానికి ఈ జన్మ సరిపోతుందో లేదో...


ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశతో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు సభల్లో గొంతు చించుకుంటూ ఆయన చేసే ప్రసంగాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమే తప్ప, తన ప్రసంగాల్లో లేవనెత్తే అంశాలపై ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదని. తన ప్రసంగంలోని అంశాలను విపక్షాలు, మేధావులు, సాధారణ ప్రజలు సైతం విమర్శించి, పాయింట్లు దొరగ్గానే పట్టుకుంటారని ప్రధానమంత్రి పదవిని కోరుకుంటున్న రాహుల్ గ్రహించడం లేదు.

పుల్వామా దాడికి వ్యూహరచన చేసిన జైష్ ఏ మహ్మద్ వ్యవస్థాపకుడు ఉగ్రవాది మసూద్ అజార్‌ను 1999 నాటి కాందహార్ హైజాకింగ్ ఎపిసోడ్‌ సందర్భంగా నాటి బీజేపీ ప్రభుత్వమే విడిచిపెట్టిందని, అందువల్ల ప్రస్తుతం ఆ సంస్థ చేస్తున్న ఉగ్రవాదదాడులు, దాని తీవ్రవాద కార్యకలాపాలకు ఒక రకంగా బీజేపీయే కారణమని అంటారు రాహుల్. కానీ పుల్వామా దాడి కేవలం ప్రమాదమని ఆయన పార్టీలోని దిగ్విజయ్, కపిల్ సిబల్, సిద్దూ లాంటి సీనియర్, జూనియర్ నేతలు పేర్కొంటుంటే రాహుల్ మాత్రం జైష్ ఏ మహ్మద్‌ని, మసూద్ అజార్‌ని మళ్ళీ తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారో ఆయనకే తెలియాలి.

కాందహార్‌ విమాన హైజాక్‌లో బందీలైన 176 మంది ప్రయాణికులను కాపాడటం కోసం ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను విడిచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీయే సలహా ఇచ్చిందని కాంగ్రెస్ అధినేతకు బీజేపీ గుర్తు చేసింది. ఆ ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వాజ్‌పేయి అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుటు అన్ని పార్టీల నేతలతో పాటు నాడు ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోనియా గాంధీ, మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారని, ప్రయాణికులను కాపాడ్డానికి మసూద్‌ను విడిచిపెట్టాలని సూచించారని బీజేపీ చెప్పింది. మరి కాంగ్రెస్ యువరాజావారు దీనికేమంటారో...

ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదుల్ని అయాచితంగా విడిచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌కే ఉందని విషయాన్ని ప్రధానస్రవంతిలోని మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా రాహుల్‌కి గుర్తు చేస్తోంది. కాస్త ఈ లింకు చూడండి...
https://www.ndtv.com/india-news/pak-terrorist-released-by-previous-government-struck-back-with-pathankot-1407168

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2010లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఎ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు షహీద్ లతీఫ్‌తో పాటు 20 మంది పాక్ ఉగ్రవాదుల్ని ఏ కారణమూ లేకుండానే విడిచిపెట్టేశారు. ఇంతమంది ఉగ్రవాదుల్ని ఎందుకు విడిచిపెట్టారో ఎవరికీ తెలియదు. 1999 నాటి హైజాకింగ్ ఘటనను తీసుకుంటే ఉగ్రవాదుల చేతిలో ఉన్న 176 మందిని కాపాడటానికి... సోనియా, మన్మోహన్ తదితర ప్రతిపక్షనేతల సలహాతోనే మసూద్ తదితర ముగ్గురు నలుగురు ఉగ్రవాదుల్ని అప్పటి బీజేపీ సర్కారు విడిచిపెట్టడం జరిగింది. మరి 2010లో అధికారంలో ఉన్న యుపిఎ సర్కారు 20 మంది ఉగ్రవాదుల్ని ఎందుకు వదిలేసిందో దేవుడికే ఎరుక. పఠాన్‌కోట్ సైనిక స్థావరంపై జరిగిన దాడికి సూత్రధారి అయిన ఈ లతీఫ్ బృందమే 1999లో మసూద్‌ని విడుదల చేయించింది. ఇదంతా తెలిసి కూడా కాంగ్రెస్ 2010లో అతన్ని ఎందుకు వదిలేసింది? రాహుల్‌కి జవాబు తెలుసా?

No comments:

Post a Comment