Tuesday 17 April 2018

దిక్కుమాలిన గగ్గోలు

   మతోన్మాద రాజకీయాల బెడద మీద మహామేధావులు కలిసి హైదరాబాద్ సదస్సులో వెలిబుచ్చిన అధర్మాగ్రహం గురించి ఈ రోజు పత్రికలలో ఓ వార్త చూశాను . నరేంద్రమోది మీద పగ పట్టిన ఓ పెద్ద తెలుగు దిన పత్రిక సంపాదకుడు కూడా పాల్గొన్న ఆ సదస్సులో మహా తెలివిగలవాళ్ళు అందరూ కూడి తేల్చింది ఏమిటంటే నరేంద్రమోడి హిట్లర్ దారిలో నడుస్తున్నాడని. జమ్మూ కాశ్మీర్ లో ఎనిమిదేళ్ళ బాలిక ను దారుణంగా చెరిచి చంపిన ఘాతుకాన్ని మోదీ క్రూరత్వానికి తాజా నిదర్శనంగా ఒక బుద్ధిలేని బుద్ధిజీవి అంటాడు. కొద్ది రోజులుగా దేశమంతటా ఇదే గగ్గోలు.


   అస్సాంలో ,బెంగాల్లో , కమ్యూనిస్టులు విప్లవాత్మకంగా రాజ్యమేలుతున్న కేరళలో ఎన్ని డజన్ల మంది హిందూ బాలికలు ఎంతమంది ముస్లిం ముష్కరుల చేతిలో ఎంత దారుణంగా చెరచబడి చిత్రవధ కాబడ్డా సెక్యులర్ సుకుమారులు చీమ కుట్టినపాటి అయినా చలించరు. నేరాన్ని నేరంలాగే చూడాలి తప్ప నేరస్తుల మతం చూడకూడదని సుద్దులు చెపుతారు. అదే ముస్లిం అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే మాత్రం వీళ్ళకు ఆమె మతం మాత్రమె కనిపిస్తుంది. దేశంలోని హిందువులందరూ కూడబలుక్కుని , ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదిని ఉసిగొలిపి బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్. గూండాల ద్వారా ఆ దురంతానికి ముస్లిములమీద పగతీర్చుకోవటం కోసమే పాల్పడినట్టు మీడియా నిండా తెగ యాగీ చేస్తారు.


   ఎక్కడో మారుమూల కుగ్రామంలో మూడు నెలలకింద ఒక ముస్లిం బాలికను ఎవరో కామపిశాచులు ఘోరంగా చెరిచి చంపి ఒక హిందూ దేవాలయం దగ్గర పారవేసి పారిపోతే , ఆ నేరం హిందువులే చేసినట్టూ, గుడిలోనే రోజుల తరబడి ఆమెను జై శ్రీ రాం అంటూ సామూహిక మానభంగం చేసినట్టూ కాషాయకామెర్లు కమ్మిన మన హిందూవ్యతిరేక సెక్యులరిష్టు, లెఫ్టిస్టు, జిహాదిష్టు, కాంగ్రెస్ పిశాచ గణం దిక్కులదిరేలా గావుకేకలు పెడుతున్నది. మేము రోజూ గుడికి వెళుతూనే ఉన్నాము, అలాంటి ఘాతుకమేదీ అక్కడ జరగనే లేదని స్థానికులు చెబుతున్నా ఈ అబద్దాలకోర్లు పట్టించుకోరు.

   సామూహిక మానభంగకార్యక్రమం ఎన్నో రోజుల పాటు జరిగినట్టుగా చెప్పబడుతున్న ఆ గుడి వాలకం చూస్తే అటువంటి కిరాతకం అక్కడ జరిగే అవకాశం ఉందని బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉన్న వాడు ఎవడూ అనలేడు. అత్యాచారానికి లోనైన బాలిక మరణించింది. అత్యాచారం చేసిన వాళ్ళ జాడ లేదు. స్థానిక హిందువులు కొందరిని కేసులో ఇరికించి అరెస్టు చేసినా , అది కావాలని చేసిన బనాయింపు దుర్మార్గమని కనపడుతూనే ఉంది. గుడిలోనే అత్యాచారం జరిగింది అనడానికి వీసమెత్తు ఆధారం లేదు . హిందువుల పవిత్ర ఆలయం దగ్గర శవాన్ని వదిలారన్న దాని బట్టే అది వేరే మతానికి చెందిన వాళ్ళు చేసిన పని అని కామన్సెన్సు ఉన్నవారెవరికైనా అర్థమవుతుంది. కాని హిందూమత ద్వేషులైన " సిక్యులరిస్టు " వింత జంతువులకు లాజిక్ తో పనిలేదు. ఏ కాడికీ మోదీని భ్రష్టు పట్టించటమే , ఆర్. ఎస్.ఎస్. ను , హిందూ మతాభిమానులను నరరూప రాక్షసులుగా చిత్రించటమే వారి సింగిల్ పాయింట్ ఎజెండా . ఉచ్చ నీచాల పట్టింపు దేశ ద్రోహులమూకకు ఏ కోశానా లేదు. సువిశాల భారత దేశంలో హిందూ స్త్రీల మీద ముస్లిం రేపిష్టులు రోజూ లెక్కలేనన్ని అఘాయిత్యాలు చేస్తున్నా పెదవి మెదపని దౌర్భాగ్యులు ఒక చోట ఒక ముస్లిం బాలిక మీద అలాంటి అఘాయిత్యం జరిగిందని తెలియగానే రెచ్చిపోయి, చొక్కాలు చించుకుని, కొవ్వొత్తులూ ప్లకార్డులూ పట్టి , దేశంలో మైనారిటీలకు భద్రత లేదు , ఆడవాళ్ళకు కనీస రక్షణ లేదు అంటూ పొలికేకలు పెట్టటం జాతివ్యతిరేకుల భయానక కుట్రలో భాగం. మతిలేని సినిమా తారలూ, బుర్ర చెడిన మీడియా మూర్ఖులూ ఈ కోరస్ లో చేరటం వల్ల పోయేది వాళ్ళ పరువే.





   

No comments:

Post a Comment