Monday 14 January 2019

మన కళ్లు తెరిపించే " పెక్యులరిజం "

భాస్కర్ కిల్లి

శివశక్తి

......

మన దేశపు హిస్టరీ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పే పుస్తకాలు చాలా తక్కువ.అలా వెదికితే ఒకటి అరా.. ఇంగ్లీష్, హిందీలో దొరుకుతాయేమో కానీ తెలుగు లో అలాంటి పుస్తకాలు దొరకడం బహు అరుదు.అటువంటి చరిత్రను తేట తెలుగులో.. ఉన్నది ఉన్నట్లు..జనాలకు సూటిగా గుచ్చుకునేటట్లు రాయడం లో ఎం.వి.ఆర్. శాస్త్రి గారు సిద్ధహస్తులు.

బహుశా..చరిత్రను ఈ విధంగా ఉన్నది ఉన్నట్లు అందించేవారిలో శాస్త్రి గారే మొదటివారు అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను.ఏది చరిత్ర,ఇదీ చరిత్ర,కాశ్మీర్ కథ , కాశ్మీర్ వ్యధ,మన మహాత్ముడు,ఆంధ్రుల చరిత్ర,భగతసింగ్ ఇత్యాది పుస్తకాలు ఈ కోవలోకి చెందినవే.

నన్ను ఈ కదన రంగంలోకి దింపింది,నాకు కర్తవ్య బోధ చేసింది పరోక్షంగా శాస్త్రి గారి పుస్తకాలే.ఆయన కలం నుండి లేటెస్ట్ గా వెలువడిన నూతన ఆవిష్కరణ ఈ "పెక్యులరిజం" అనే ఈ సరికొత్త పుస్తకం.


 ఈ పుస్తకానికి,శాస్త్రి గారి మునుపటి  పుస్తకాలకు ఒక ప్రత్యేకమైన తేడా ఉంది. వెనకటి పుస్తకాలు మన వక్ర చరిత్ర నుండి నిజమైన చరిత్రని వేరు చేసి మనకు చూపిస్తే..ఈ ' పెక్యులరిజం' మన దేశంలో అత్యధిక జనాభా అయిన హిందువులు మన దేశంలోనే అత్యంత నికృష్టంగా రెండవతరగతి పౌరులుగా జీవింపబడుతున్న దుస్థితిని రుజువు లతో సహా నిరూపించింది.

ఒక పథకం ప్రకారం హిందూస్థాన్ ని హిందువులు లేని స్థానం గా మార్చడానికి బలమైన శక్తులు ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్నాయి..కొంతవరకు విజయం సాధించాయి కూడా.
ఇది నిజంగా కలిచివేసే విషయం..ఇప్పటికే దీనిని చాలా మంది హిందువులు గ్రహించారు .కానీ దీనికి మూలం ఎక్కడో,ఏమిటో ఎవరికి తెలియదు.శాస్త్రి గారు విషయాన్ని తేటతెల్లం చేసేంతవరకు అసలు విషయం నాకు కూడా తెలియదు.

సెక్యులరిజం అనే " నడమంత్రపు సిరి" మన భారత రాజ్యాంగం లో ముందు నుండి లేదని..ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా చొప్పించింది అని ఈపుస్తకం లో తెలుసుకుని ఆశ్చర్యపోయాను.

తిరుగులేని అసలు మెజారిటీ అయిన హిందువులను దెబ్బకొట్టడం,మైనారిటీ లను నెత్తిన పెట్టుకోవడం అనే అన్యాయాన్ని రాజ్యాంగ కర్తలు తెలిసో, తెలియకో చేశారు అని..దానికి కోర్టులు తమ అడ్డదిడ్డపు తీర్పుఋలతో  సమస్యను జటిలం చేశాయి అని శాస్త్రి గారు విశదీకరించారు.
సెక్యులరిజాన్ని పెక్యులరిజం గా రాజ్యాంగం,కోర్టులు మార్చిన విధాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు.

నేటి పెద్ద సమస్య అయిన శబరిమల అయ్యప్ప దేవాలయం  నుండి.. పిల్లలు చదువుకునే చదువులు వరకు ఎలా హిందువులకు , వారికి పవిత్రమైన విశ్వాసాలకు , మన దేశానికి ప్రాణమైన ధర్మానికి ఎంత  వ్యతిరేకంగా ఉన్నాయి.. దుష్టశక్తులు ఏ విధంగా హిందువులపై జులుం ప్రదర్శిస్తున్నాయి అనే విషయం చాలా బాగా చెప్పారు.

హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే..బహుశా ఇక కళ్ళు తెరవాల్సిన అవసరం ఉండదేమో..ఇక శాశ్వతంగా ఆ కళ్ళను తెరిపించి గొంతులో ప్రాణం తీసేస్తారేమో ఈ హిందూ వ్యతిరేక దుర్మార్గులు.

ఇప్పటికే చాలా నష్టం జరిగింది.కానీ సమయం ఇంకా మన వైపే ఉంది.నిద్రాణమై ఉన్న హిందూ శక్తి కళ్ళు తెరిచి, పరాశక్తి  గా మారి రాజ్యాంగంలోను,రాజకీయ నాయకుల లోను,ప్రభుత్వ యంత్రాంగం లోను ఉన్న హిందు వ్యతిరేకతను  ఎదుర్కోవాలి. అభారతీయ , అధార్మిక  అవ్యవస్థను  పెకలించాలి. ఓటు అనే ఆయుధం ద్వారా..ప్రభుత్వాల , పార్టీల మెడలు వంచి మనకు వ్యతిరేకం గా ఉన్న చట్టాలు,రాజ్యాంగ అధికరణాలు మనమే మార్చుకోవాలి.అప్పుడే మనకు నిష్కృతి.లేకపోతే అధోగతి.

ముందుగా చేయవలసింది శాస్త్రి గారి పెక్యులరిజం పుస్తకం తెప్పించుకుని చదవండి. విషయం అవగాహన చేసుకొండి.తదనుగుణంగా స్పందించి రాబోయే ప్రమాదాన్ని నివృత్తి చేసుకోండి.

శాస్త్రి గారి పుస్తకాలు అమెజాన్ వెబ్సైట్ లో దొరుకుతాయి.
తప్పకుండా చదవండి.నలుగురి చేత చదివించండి.
నిజమైన చరిత్ర తెలుసుకోండి.. తద్వారా..మీకు,మనకు,దేశానికి జరిగిన,జరుగుతున్న ఉపద్రవాన్ని తొలగించండి.
https://www.amazon.in/dp/9387171027/ref=mp_s_a_1_15?ie=UTF8&qid=1544842978&sr=8-15&pi=AC_SX118_SY170_FMwebp_QL65&keywords=mvr+sastry+books











No comments:

Post a Comment